రామడుగు, జూలై 24: తెలంగాణలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. వెలిచాల శివారులోని ప్రశాంత్ భవన్లో ఆదివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనాథ పిల్లలకు ఒక రోజు భోజనానికి కావాల్సిన నిత్యావసర సరుకులతో పాటు దుస్తులు అందజేశారు.
ఈ సందర్భంగా వీర్ల వెంకటేశ్వర రావు మాట్లాడారు. అలాగే, వెలిచాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సర్పంచ్ వీర్ల సరోజన పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటి, నీళ్లు పోశారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు వీర్ల సంజీవరావు, కొండగట్టు దేవస్థానం బోర్డు డైరెక్టర్ బండపెల్లి యాదగిరి, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ జూపాక కరుణాకర్, గోపాల్రావుపేట ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి, వైస్ చైర్మన్ చాడ ప్రభాకర్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు కొడిమ్యాల రాజేశం, గడ్డం మోహన్రావు, బత్తిని తిరుపతిగౌడ్, శనిగరపు అనిల్కుమార్, మీస లచ్చయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బండ అనిల్రెడ్డి, సర్పంచులు జవ్వాజి శేఖర్, చంటి జీవన్, ఎంపీటీసీ వంచ మహేందర్రెడ్డి, వీడీసీ చైర్మన్లు నాగుల రాజశేఖర్గౌడ్, సైండ్ల కరుణాకర్, మాజీ ఎంపీపీ తౌటు మురళి, గంగాధర ఏఎంసీ మాజీ చైర్మన్ ఎల్కపల్లి లచ్చయ్య, మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్రావు, ఆర్బీఎస్ గ్రామ కో-ఆర్డినేటర్లు కొత్తూరి నారాయణ, పెరుమాండ్ల శ్రీనివాస్గౌడ్, ఉప సర్పంచ్ పూదరి వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకులు లంక మల్లేశం, సాతర్ల వివేకానంద, ఆరపెల్లి ప్రశాంత్, బీ సురేశ్, శనిగరపు అర్జున్, రవీందర్, వంగ వెంకటరమణ, కొడుముంజ లేఖరాజు, ఎడవెల్లి మల్లేశం, పెగడ శ్రీనివాస్, చంటి శ్రీనివాస్, ఎల్లమ్మల నర్సింహరాజు, పీసరి అనిల్, రూగూరి పోశెట్టి, తాడెం పవన్, మైపాల్, శివ, వినోద్, తిరుపతి, కుమార్, సురేశ్, నారాయణ, సుధాకర్, మహేశ్, అజయ్, ప్రశాంత్ పాల్గొన్నారు.