హుజూరాబాద్ టౌన్, డిసెంబర్ 6: ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేదర్ రూపొందించిన రాజ్యాంగం సాక్షిగా రైతులు సాగు చేసిన ప్రతి గింజనూ పాలకులు కొనుగోలుచేసి అన్నదాతలకు భరోసా కల్పించాలని రైతు నాయకుడు, ఓసీ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు కోరారు. ఓసీ సమాఖ్య రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేదర్ వర్ధంతి సందర్భంగా హుజూరాబాద్ పట్టణ చౌరస్తాలోని అంబేదర్ విగ్రహానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొలాడి రామారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లల్లో అన్నదాతలను ఆయోమయానికి గురి చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం డ్రామాలు ఆపి అన్నదాతలకు అనుకూలంగా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే క్రాప్ హాలీ డే ప్రకటించి ఎకరాకు రూ.20వేల చొప్పున బతుకుదెరువు నిమిత్తం నష్టపరిహారంగా రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవితాన్ని వెళ్లదీస్తున్న వ్యవసాయ కూలీలకు 3 నెలల పంట కాలానికి 100 రోజుల పని నిమిత్తం రూ.40 వేల చొప్పున ఖాతాల్లో జమ చేయాలని తెలిపారు. రైతు వ్యతిరేక విద్యుత్ సంసరణల సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు హరికృష్ణాగౌడ్, బొరగాల సారయ్య, సొల్లు దశరథం, కలకోట శ్రావణ్, మందల కుమార్, తీగల కొండల్రావు, స్వామిరెడ్డి, తిరుపతిరెడ్డి, నర్సింహరెడ్డి, రాజన్న, బత్తిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.