కరీంనగర్: ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. ప్రముఖులు మొదలుకొని ప్రతిఒక్కరు ఆయా సందర్భాల్లో మొక్కలు నాటుతున్నారు. తాజాగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా చొప్పదండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొక్క నాటారు. అనంతరం మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం తనకెంతో స్ఫూర్తినిస్తుందని చెప్పారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా వినూత్నమైన మార్పు తీసుకొచ్చిందని వెల్లడించారు.