గంగాధర, అక్టోబర్ 25: నియోజకవర్గంలో ఇప్పటికీ కాంగ్రెస్కు అభ్యర్థి ఖరారు కాలేదని, ఆ పార్టీలో ఉండేది కుర్చీల కొట్లాటలే కానీ ప్రజా సంక్షేమం కాదని చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎక్కువ, వాళ్లకు వచ్చే ఓట్లు తక్కువని ఎద్దేవా చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాహుల్గాంధీ పర్యటన అట్టర్ ప్లాప్ అయ్యిందని, పట్టుమని 500 మంది కూడా లేరని పేర్కొన్నారు. బుధవారం మండలంలోని మధురానగర్లో బీఆర్ఎస్ మండల కార్యాలయాన్ని సుంకె రవిశంకర్ ప్రారంభించారు.
పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావును సీట్లో కూర్చోబెట్టి అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన రాహుల్గాంధీకి రోడ్లపై దోశలు వేయడానికి సమయం దొరికింది కానీ భక్తుల కొంగు బంగారం కొండగట్టు అంజన్నను దర్శించుకోవడానికి సమయం లేదని సుంకె రవిశంకర్ ఎద్దేవా చేశారు. అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు, ఆకలి చావులే ఉన్నాయని గుర్తు చేశారు.
ఐదు గ్యారెంటీలతో కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా చేతులెత్తేసిందన్నారు. 400 ఉన్న సిలిండర్ ధరను 1200 చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని, ఆ పార్టీలు అధికారంలోకి వస్తే పేదలను కొట్టి పెద్దలకు పెడతారన్నారు. సీఎం కేసీఆర్తోనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, మాట ఇచ్చి మడమ తిప్పని నాయకుడు కేసీఆర్ అని, బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోను తప్పకుండా అమలు చేసి తీరుతారని స్పష్టం చేశారు.
చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఓటు వేస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ ఎంపీపీ శ్రీరాం మధుకర్, జడ్పీటీసీ పుల్కం అనురాధానర్సయ్య, సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలగౌడ్, వెలిచాల తిర్మల్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ పుల్కం గంగన్న, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, వైస్ చైర్మన్లు వేముల భాస్కర్, సామంతుల శ్రీనివాస్, సర్పంచులు వేముల లావణ్యఅంజి, మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, కంకణాల విజేందర్రెడ్డి, దోర్నాల హన్మంతరెడ్డి, ముక్కెర మల్లేశం, ఆకుల శంకరయ్య, జోగు లక్ష్మీరాజం, ఎండీ నజీర్, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, ద్యావ మధుసూదన్రెడ్డి, నా యకులు రేండ్ల శ్రీనివాస్, రామిడి సురేందర్, వంగల మల్లికార్జున్, ఆకుల మధుసూదన్, అట్ల శేఖర్రెడ్డి, తోట మహిపాల్, పంజాల ఆంజనేయులు, బొల్లాడి శ్రీనివాస్రెడ్డి, సుంకె అనిల్, ఇరుగురాల రవి, పెంచాల చందు, మామాడిపెల్లి అఖిల్ గంగాధర సంపత్ పాల్గొన్నారు.