కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 27 : కరీంనగర్ నూతన కలెక్టర్గా నియామకమైన ఐఏఎస్ అధికారి చిత్రా మిశ్రా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయమే నగరానికి చేరుకున్న ఆమెకు అదనపు కలెక్టర్తోపాటు రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ చాంబర్కు వెళ్లిన ఆమె, రిజిస్టర్లో సంతకం చేసి విధుల్లో చేరారు.
ప్రభుత్వ శాఖల అధికారులతో పరిచయ కార్యక్రమం అనంతరం ఆయా విభాగాల పనితీరుపై సమీక్షించారు. అంతకుముందు అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో కుందారపు మహేశ్వర్, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గడ్డం సుధాకర్ మొక్కలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా శాఖ ప్రతినిధులు కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళీచరణ్, కార్యదర్శి డాక్టర్ అరవిందరెడ్డి, కోశాధికారి నాగరాజు, సహాయ కార్యదర్శి సుధాకర్, సాంస్కృతిక కార్యదర్శి రాజునాయక్, క్రీడాకార్యదర్శి కొండాల్రెడ్డితో పాటు రెవెన్యూ అధికారులు, కరీంనగర్ అర్బన్, రూరల్ తహసీల్దార్లు, ట్రెజరీ సిబ్బంది, ఇతర అధికారులు పూలమొక్కలు అందించి విషెస్ తెలిపారు.