కార్పొరేషన్, ఫిబ్రవరి 17: నగరంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలంగాణచౌక్లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ యాదగిరి సునీల్రావు, సుడా చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. మొక్కలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ దేశానికి ప్రతినిధ్యం వహించడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, బండారి వేణు, వాల రమణారావు, కంసాల శ్రీనివాస్, చాడగొండ బుచ్చిరెడ్డి, నాయకులు ఆరె రవి, కర్ర సూర్యశేఖర్, నాగుల కిరణ్, సత్తినేని శ్రీనివాస్, తిరుపతి, కలర్ సత్తన్న, కరీం, వొడ్నాల రాజు, మారుతి, దూలం సంపత్ తదితరులు పాల్గొన్నారు. భగత్నగర్లోని క్యాంపు కార్యాలయంలో వేయర్ వై సునీల్రావు కేక్ కట్ చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచిపెట్టారు. నాయకులు అనిల్కుమార్, వెంకట్రావు, ప్రకాశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. స్థానిక లేబర్ అడ్డా వద్ద 59వ డివిజన్ కార్పొరేటర్ గందె మాధవి-మహేశ్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేశారు. మేయర్ సునీల్రావు, బీఆర్ఎస్ నాయకులు అజిత్రావు, సదానందచారి, మొగిలోజి వెంకట్, ఆకుల నర్సయ్య పాల్గొన్నారు. 42వ డివిజన్లో కార్పొరేటర్ మేచినేని వనజ-అశోక్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ను మేయర్ సునీల్రావు కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి కళ్లద్దాలు అందజేశారు. బీఆర్ఎస్ నాయకులు పవన్, రాజేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. టవర్సర్కిల్ వద్ద కార్పొరేటర్ వంగల శ్రీదేవి-పవన్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ప్రసాద్, సూర్యశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్ఖానాగడ్డ ప్రభుత్వ పాఠశాలలో బీఆర్ఎస్ నాయకుడు కులదీప్ వర్మ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులను మేయర్ పంపిణీ చేశారు. కార్పొరేటర్ తోట రాములు, నాయకులు పవన్, రవివర్మ, శ్రీనివాస్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్లో బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు జమీలొద్దీన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మేయర్ సునీల్రావు, బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు శుక్రొద్దీన్, ఫక్రొద్దీన్, కొత్తపల్లి కౌన్సిలర్లు రాంబాబు, శ్రీకాంత్, బాబా, కో-ఆప్షన్ సభ్యులు సుధాకర్, ప్రభాకర్, మున్నావర్ ఖాన్, ఇఫ్తాకర్ అహ్మద్, బాబాజానీ తదితరులు పాల్గొన్నారు. గాయత్రీనగర్లోని క్యాన్సర్ దవాఖానలో కార్పొరేటర్ నేతికుంట యాదయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కాశెట్టి శ్రీనివాస్, భూమాగౌడ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక బీసీ స్టడీ సరిల్లో కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ప్లేట్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నాయకులు తిరుపతి, రేణుక, పద్మ తదితరులు పాల్గొన్నారు. రేకుర్తిలోని శివాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో 500 మంది భక్తులకు అన్నదానం చేశారు. ఆలయంలో మేయర్ సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పూజలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు శ్రావణ్, అనిల్, విజయేందర్, సుధీర్రెడ్డి, నరేశ్, పరశురాం, శ్రీకాంత్, మోహన్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు యూసుఫ్ ఆధ్వర్యంలో స్థానిక కరీముల్లాషా దర్గాలో ప్రార్థనలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మేయర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్రెడ్డి, షౌకత్అలీ, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు ఫహాద్, ఇస్తియాక్, సలీం, మీర్జా అస్మత్, మున్నా, తబ్రేజ్, బియాబానీ, ఆసీఫ్, కరీం, సైద్ మజీద్, ఆరీఫ్, అఫ్జల్, అక్రం తదితరులు పాల్గొన్నారు. భగత్నగర్లోని అయ్యప్ప ఆలయంలో మంగళంపల్లి రాజేశ్వరశర్మ, డింగరి చాణక్య ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ఫల పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, అలంకరణ చేశారు. ఆలయ ఈవో కాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కార్యాలయంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. బీఆర్ఎస్ నాయకులు జీఎస్ ఆనంద్, గీతాంజలి, ఈసంపల్లి మధునయ్య, సాయి, లింగంపల్లి సత్యం, నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కంసాల శ్రీనన్న యువసేన, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కిసాన్నగర్ జంబిగద్దె వద్ద కేక్ కట్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు సంపతి అశోక్, మారముల్ల సాంబయ్య, గసికంటి అరుణ్, జల్లి కోటేశ్వర్, పులిపాక వేణు, చింతల ప్రభాకర్, కుమ్మరి సాగర్, దరిపెల్లి అంజయ్య, వెంకటేశ్, సుల్తానా, తదితరులు పాల్గొన్నారు. సుభాష్నగర్లోని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘ భవనంలో జిల్లా అధ్యక్షుడు బొంకూరి రాములు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. వంగ అంజయ్య, నీర్ల శ్రీనివాస్, బత్తుల అనిల్, రాజు, శంకరయ్య, గంగాధర బాబు, ఆశీర్వాదం, గాలి వెంకటస్వామి, దీకొండ కిష్టయ్య, కొడిపెల్లి చంద్రయ్య, రామకృష్ణ, గసికంటి పోచయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకుడు పెండ్యాల మహేశ్కుమార్ ఆధ్వర్యంలో అనాథ పాఠశాలల్లో విద్యార్థులకు పండ్లు, బ్రెడ్, టీషర్టులు, ఇతర సామగ్రి అందజేశారు. అలాగే, టవర్సర్కిల్ ప్రాంతంలో కార్మికులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్, బీఆర్ఎస్ నాయకులు రాము, దెబ్బటి సూర్య, తోట మధు, కెంసారం తిరుపతి, సాయి, సురేశ్, నాగురి అజయ్, తిరుమలరెడ్డి, శ్రావణ్, ప్రశాంత్, సద్విర్సింగ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, ఫిబ్రవరి 17: కొత్తపల్లిలోని సంఘం చౌరస్తా వద్ద మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. కౌన్సిలర్లు వాసాల రమేశ్, జేరిపోతుల మొండయ్య, గండు రాంబాబు, చింతల సత్యనారాయణ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు ఎండీ ఫక్రొద్దీన్, చెట్టిపెల్లి ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు వేముల శేఖర్, జేరిపోతుల శ్రీకాంత్, గున్నాల రమేశ్, ఎస్కే బాబా, ఎండీ జమీలొద్దీన్, కట్ల సుధాకర్, ఎస్కే మునావర్ఖాన్, సుదర్శన్, దూస మునీందర్, తదితరులు పాల్గొన్నారు. మండలంలోని ఆసిఫ్నగర్లో ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్గౌడ్, జడ్పీటీసీ పిట్టల కరుణ-రవీందర్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్ గౌడ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులతో కలిసి కేక్ కట్ చేశారు. జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు సాబీర్, సర్పంచ్ కడారి శాంత-శ్రీనివాస్, ఉప సర్పంచ్ పెంచాల శ్రీలత-తిరుపతి, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు పెరిక శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు పెరుక లక్ష్మణ్రావు, పెంచాల ఆంజనేయులు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కలెక్టరేట్, ఫిబ్రవరి 17: కలెక్టరేట్లో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాములు నాయక్, ప్రధాన కార్యదర్శి అంజయ్య, ప్రతినిధులు వెంకటేశ్, మౌలానా, రజాక్, రంగయ్య, రఘుపతి పాల్గొన్నారు.
ముకరంపుర, ఫిబ్రవరి 17: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో చైర్మన్ రెడ్డవేని మధు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి పెట్టారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, డైరెక్టర్లు గుండేటి అనిత, గంగాధర లస్మయ్య, బోనాల జనార్దన్, చింతకుంట ఎంపీటీసీ తిరుపతినాయక్, అడ్తిదారులు, హమాలీలు, దడ్వాయిలు, రైతులు, మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.
కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 17: ధూప దీప నైవేద్య అర్చక సమాఖ్య రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలోని ధూప దీప నైవేద్య అర్చకులు ఆలయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గోత్రనామార్చనతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సంఘం రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్ర శర్మ, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆంజనేయ చార్య పేర్కొన్నారు. ఈ క్రమంలో తాటిపెల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి సుభిక్షంగా ఉండాలని సుదర్శన, ఆయుష్య హోమం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదానం చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో సంఘం నాయకులు నాగరాజ్ మహీంద్రాచార్య, మధుసూదనాచార్య, గోవర్ధన యజిత్ చార్య, నిట్టూరి సతీశ్ శర్మ, జకాపురం నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 17: మండలంలోని దుబ్బపల్లిలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య కేక్ కట్ చేశారు. చామనపల్లిలోని ఉమామహేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జువ్వాడి రాజేశ్వర్రావు, బీఆర్ఎస్ నాయకులు జీ శ్రీనివాస్, ఐలయ్య, గంగయ్య, తదితరులు పాల్గొన్నారు. చెర్లభూత్కూర్లో బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, కాల్వ రమేశ్, పంది తిరుపతియాదవ్, మెరుగు శ్రీధర్, చిట్కూరి స్వామి, అజయ్, కూర అరుణ, దాసరి వకుళ, అనిత, తదితరులు పాల్గొన్నారు. మొగ్దుంపూర్లో సర్పంచ్ జక్కం నర్సయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. జడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు పంపిణీ చేశారు. ఎంపీటీసీ పుష్ప-అంజిరెడ్డి, పోతర్ల క్రాంతికుమార్, నాయకులు మైలారం నాగరాజు, వడ్లూరి అశోక్, వడ్లూరి లక్ష్మణ్, మీసాల రమణ, ఎండీ హమీద్, మంద అశోక్, తాండ్ర రమేశ్, తాండ్ర రాజేశ్వర్రావు, మీసాల ప్రశాంత్, శేఖర్ పాల్గొన్నారు. గోపాల్పూర్లో బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు మల్లారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. నాయకులు ఊరడి మల్లారెడ్డి, మంద రాజమల్లు, వేణు, అంజయ్య పాల్గొన్నారు. నగునూర్లో సర్పంచ్ ఉప్పుల శ్రీధర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఉపసర్పంచ్ దామెరపల్లి దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు లక్ష్మయ్య, ఎంపీటీసీలు సాయిల వినయ్సాగర్, అంకమల్ల శ్రీనివాస్, నెక్ పాషా, రాంరెడ్డి, వరి భద్రయ్య, శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. చేగుర్తిలో బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు గాండ్ల కొమురయ్య కేక్ కట్ చేశారు. ఉపసర్పంచ్ గాండ్ల విజయ, గాండ్ల అంజయ్య, ఎంపీటీసీ ఎల్కపల్లి స్వరూప, నాయకులు ఎల్కపల్లి చంద్రమోహన్, గాండ్ల లక్ష్మీనారాయణ, సంపత్, రాజు, తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ చామనపల్లి అరుణ కేక్ కట్ చేశారు. ఉపసర్పంచ్ గాండ్ల విజయ, సింగిల్ విండో డైరెక్టర్ గాండ్ల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు. ఇరుకుల్లలో బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బుర్ర రమేశ్ గౌడ్ కేక్ కట్ చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జువ్వాడి రాజేశ్వర్రావు, మండల కో-ఆప్షన్ సభ్యుడు సర్వర్పాషా, మహ్మద్, రమేశ్, సంపత్ పాల్గొన్నారు. తాహెర్కొండాపూర్లో బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు చింతల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ను సర్పంచ్ మడికంటి మమత కట్ చేశారు. మడికంటి మారుతి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బొమ్మకల్లో బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు జోజి రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. ఎంపీటీసీ ర్యాకం లక్ష్మి, మోహన్, శంకర్, ఆంజనేయులు, తిరుపతిరెడ్డి, మహేందర్రెడ్డి, శ్రీనివాస్, అశోక్, లక్ష్మణ్, వెంకన్న పాల్గొన్నారు. ఎలబోతారం గ్రామ పంచాయతీ వద్ద చామనపల్లి పీహెచ్సీ వైద్యురాలు అరుణ కేక్ కట్ చేశారు. సర్పంచ్ కట్ల లక్ష్మి, ఎంపీటీసీ చల్ల రామక్క, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బుచ్చాల కొమురయ్య, చల్ల లింగారెడ్డి, కట్ల గౌతంరెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. దుర్శేడ్లో ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్రావు ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, గాజుల అంజయ్య, రాజ్కమల్, శ్రీనివాస్, సంపత్, రమేశ్, అనిల్, మహేశ్ పాల్గొన్నారు. ఫకీర్పేటలో సర్పంచ్ కటుకం నందు కేక్ కట్ చేశారు. వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, ఫిబ్రవరి 17: వావిలాలపల్లిలోని తెలంగాణ నాయీబ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నీలం మొండయ్య కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ఎర్రబోజు నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల జయరాం, నగర అధ్యక్షుడు సంపత్, నాయకులు లక్ష్మణ్కుమార్, వీరేందర్, సదానందం, మహేందర్, రమేశ్, రవీందర్ పాల్గొన్నారు.
కోర్టుచౌరస్తా, ఫిబ్రవరి 17: జిల్లా కోర్టు ఆవరణలో రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ ట్రస్టు సలహా మండలి సభ్యులు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పీవీ రాజ్కుమార్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆరెల్లి రాములు, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ కేవీ వేణుగోపాలరావు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గౌరు రాజిరెడ్డి, ఏజీపీ పూరెల్ల రాములు, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కొట్టె తిరుపతి, పెరుక శ్రీనివాస్, రేణుక, న్యాయవాదులు పెంచాల ప్రభాకర్ రావు, కూర శ్రీనివాస్రెడ్డి, రజినీ, నాగేందర్, తిరుపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్, ఫిబ్రవరి 17: నగరంలోని కృషి భవన్లో గుల్షన్-ఏ-సుఫీ సంస్థ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల జనార్దన్ రావు హాజరై కేక్ కట్ చేశారు. సంస్థ అధ్యక్షుడు సుఫీ సయ్యద్ మహబూబ్ అలీ ఖాద్రీ, మహ్మద్ ఖదీర్, కులసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్ ఆనంద్, రామకృష్ణ, జిల్లా సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం సభ్యులు తొడుపునూరి ఆనందం, చింతల సత్యనారాయణ, బాబా బాయ్, శ్రీనివాస్, షేక్ హబీబ్, షాబొద్దీన్, ముబీన్, షేక్ ఖాజా పాషా పాల్గొన్నారు.