కమాన్చౌరస్తా, మే 18: ఎప్సెట్ -24 ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు జయకేతనం ఎగరేశారు. రాష్ట్రస్థాయిలో అద్భుత ప్రతిభచూపి ఘనవిజయం సాధించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లి టైనిటాన్స్ క్యాంపస్లో విలేకరుల సమావేశంలో ఆయన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. కళాశాలకు చెందిన వీ హాసిని 114, ఎన్ హేమంత్ 157, జీ శ్రీహాస్ 166, కే సుప్రియ 296, ఎన్ జ్ఞానద 480, వీ శ్రీముఖి 568, ఎం వర్షీత్ 575,
జీ సాయిమంజునాథ్ రెడ్డి 610, పీ జ్యోతిర్మయిరెడ్డి 863, శ్రీ వెన్నెల 876, తేజస్విని 942, ఏ శివవరుణ్ 973, సీహెచ్ అనూహ్య 950, పీ శ్రీనాథ్ 986, మలిహాఫాతిమా 992వ ర్యాంకు సాధించారన్నారు. 16 మంది విద్యార్థులు వెయ్యిలోపు ర్యాంకు సాధించడం గొప్పవిషయమన్నారు. అలాగే 39 మంది విద్యార్థులు 2వేల లోపు ర్యాంకులు, 63 మంది విద్యార్థులు 3వేల లోపు ర్యాంకులు, 116 మంది విద్యార్థులు 5వేల లోపు ర్యాంకులు సాధించి అల్ఫోర్ కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటారని చెప్పారు. రాబోయే ఐఐటీ అడ్వాన్స్, నీట్ ఫలితాల్లో అల్ఫోర్స్ మహోన్నత ర్యాంకులతో ముందంజలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.