రాంనగర్, మార్చి 2 : సులభంగా డబ్బు సంపాదించాలని, అడ్డదారితొక్కి మాదకద్రవ్యాలు రవాణా చేస్తూ, యువతను మత్తువైపు మరల్చుతున్న నిందితుడిని త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితున్ని గురువారం కమిషనరేట్లో మీడియా ఎదుట హాజరుపరిచి, పోలీస్ కమిషనర్ సు బ్బారాయుడు వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రా మానికి చెందిన గండికోట దేవరాజు ఉపాధి కో సం సౌదీ అరేబియాకు వెళ్లి డ్రైవర్గా పనిచేశా డు. అనంతరం స్వగ్రామానికి తిరిగి వచ్చిన అతడు పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించాలనుకున్నా డు.
గతంలో ఒడిశా రాష్ట్ర సరిహద్దులో పనిచేసిన అనుభవంతో గంజాయి అమ్మకాలు సాగిస్తు న్నాడు. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి మరో ముగ్గురితో కలిసి కరీంనగర్లో సరఫరా చేస్తున్నాడు. కాగా, దేవరాజు గ్రామం నుంచి బయటికి వెళ్లి మూడు రోజులకు తిరిగి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి కదలికలపై నిఘా పెట్టి, గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సీపీ వెల్లడించారు. అతడికి సహకరించిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను పట్టుకోవడంలో శ్రమించిన త్రీ టౌన్ సిబ్బందిని సీపీ అభినందించారు. ఈ సమావేశంలో డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ తులా శ్రీనివాస్ రావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.