రాజన్న సిరిసిల్ల, జనవరి16(నమస్తే తెలం గాణ)/ వేములవాడ/ చందుర్తి/గంభీరావుపేట/ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట/ సిరిసిల్ల రూర ల్, జనవరి 16: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెం ట్, ఎమ్మెల్యే కేటీఆర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ తో కలిసి కలియదిరిగారు. ఉదయాన్నే 11:30 గంటలకు జిల్లాకు చేరుకున్న ఆయన, రాత్రి 10 గంటల దాకా ఇక్కడే ఉన్నారు. సిరిసిల్ల పట్ట ణంలో బీఆర్ఎస్ కార్యకర్త అగ్గి రాములు గృహప్రవేశం చేయగా, టూర్లో భాగంగా ముందుగా అతడి నివాసానికే వెళ్లి శుభాకాం క్షలు తెలిపారు.
ఇటీవల వివాహం చేసుకున్న బీవైనగర్కు చెందిన కార్యకర్త గజభీంకార్ బాబు కూతురు, అల్లుడిని ఆశీర్వ దించారు. అనారోగ్యంతో ఉన్న నెహ్రూనగర్ కౌన్సిలర్ గుండ్లపల్లి రామానుజం ఇంటికి చేరుకుని అతడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పద్మనగర్ కౌన్సిలర్ కుడిక్యాల రవిని పరామ ర్శించారు. అనంతరం రగుడు వద్ద తెలంగాణ భవన్కు చేరుకుని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచుల ఆత్మీయ సత్కారా నికి హాజరయ్యారు. 103 సర్పంచులను సన్మా నించి, జ్ఞాపికలు అందజేసి వారితో సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం కార్మికశాఖ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ ఆధ్వర్యం లో ముద్రించిన భారత రాష్ట్ర ట్రేడ్ యూని యన్ నూతన సంవత్సర క్యాలెండర్ను తెలం గాణ భవన్లో ఆవిష్కరించారు.
తర్వాత చందుర్తి మండలానికి చేరుకుని కేసీఆర్ వాలీ బాల్ కప్ టోర్నీని ప్రారంభిం చారు. తిరుగు ప్రయాణంలో తంగళ్లపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మీనర్సింహ స్వామి ఆలయం లో పూజలు చేశారు. తర్వాత వేములవాడలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనరసిం హారావు నివాసానికి వచ్చారు. ప్రజా ప్రతిని ధులు, పార్టీ ముఖ్య కార్యకర్తలతో కాసేపు ముచ్చటించారు. అనంతరం తేనేటి విందును స్వీకరించి చందుర్తి మండలంలోని ఓ కార్యక్ర మానికి వెళ్లారు. తంగళ్లపల్లి లో బీఆర్ఎస్ సీని యర్ నేతలు తిరునహరి భానుమూర్తి, వెంగళ రమేశ్ నివాసానికి వెళ్లా రు. భానుమూర్తి కొడుకు, రమేశ్ కూతురు వివాహాలు ఇటీవలే జరుగగా, నూతన దంపతులను ఆశీర్వదిం చారు.
రాళ్లపేటలో మాజీ సర్పంచ్ ఆసాని బాపురెడ్డి కొడుకును పరామర్శించారు. కస్బెకట్కూర్లోని చింతలపల్లిలో బీఆర్ఎస్వీ జిల్లా చీమల ప్రశాంత్ యాదవ్ దంపతులను ఆశీర్వదించారు. ఓబులాపూ ర్లోని బీఆర్ఎస్ వీ జిల్లా నేత కొత్త సంతోష్గౌ డ్ కొడుకుకు నామకరణం చేయగా, చిన్నారిని ఆశీర్వదించా రు. జిల్లెల్లలో డైనమిక్ ఫౌండేషన్ వ్యవస్థాప కుడు దుబ్బా రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన వాలీబాల్ పోటీల్లో విజేతలకు బహుమ తులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నియోజకవర్గ ఇన్ చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు.
టీపీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సర్పంచుల ఫోరం అధ్యక్షు డు మాట్ల మధు, బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణాధ్య క్షుడు జిందం చక్రపాణి, ఎంపీపీలు జనగామ శరత్రావు, మల్లేశం యాదవ్, చంద్రయ్య గౌ డ్, బైరగోని లావణ్య, జడ్పీటీసీ మ్యాకల రవి, సెస్ డైరెక్టర్లు రేగులపాటి చరణ్రావు, సందుప ట్ల అంజిరెడ్డి, కౌన్సిలర్లు మారం కుమార్, నిమ్మశెట్టి విజయ్, ఇప్పపూల అజయ్, సిరిగిరి రామచందర్, జోగిని శంకర్, నరాల శేఖర్, యాచమనేని శ్రీనివాసరావు, పీఏసీఎస్ చైర్మ న్లు బండ నర్సయ్యయాదవ్, రామ్మోహన్ రావు, నాయకులు రాఘవరెడ్డి, గూడూరి మధు, నీలం శేఖర్, గోపు బాలరా జు, వెంగళ శ్రీకాంత్గౌడ్, నాయకులు ప్రవీణ్, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ వీరబత్తిని కమలాకర్, బీఆర్ ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, సీఎం కేసీఆర్ కప్ నిర్వాహకుడు ఈర్లపల్లి రాజు, సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ, ముస్తా బాద్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కలకొండ కిషన్రావు ఉన్నారు.
పట్టణంలో రాత్రి వేళ పర్యటించిన తమ అభిమాన నేత కేటీఆర్ను చూసి చిన్నారులు, మహిళలు పరుగెత్తుకొచ్చారు. కొంత మంది చిన్నారులు తమ బర్త్డే ఉందని చెప్పి సెల్పీలు దిగారు. బాగా చదువుకుని అమ్మనాన్నలకు మంచి పేరు తీసుకురావాలని చాక్లెట్లు ఇచ్చి ఆశీర్వదించారు. రామన్న చూసి మహిళ లు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. వారిని అప్యాయం గా పలకరించి సమస్యలు విని తానున్నా నంటూ భరోసా ఇచ్చారు.
అక్కడి నుంచి తంగళ్లపల్లి మండల కేంద్రానికి చేరుకుని నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మీ నర్సింహస్వా మి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం మండలంలోని పలుగ్రామాలలో పర్యటించి బీఆర్ఎస్ అనారోగ్యాల బారిన పడ్డ పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. రాత్రి పది గంటల వరకు ఆయన పర్యటన సాగింది. తిరిగి హైదరాబాద్ వెళ్లే వరకు కార్యకర్తలు, పల్లెలోని ప్రజలంతా రామన్నవెంటే ఉన్నారు. ఆయన వెళ్లిన ప్రతి గ్రామంలోని ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి కేటీఆర్తో సంబురంగా సెల్పీలు దిగారు. అందరి ఆప్యాయంగా పలకరిస్తూ వృద్దులను దగ్గరకు తీసుకుని ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.