బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం జిల్లా కేంద్రానికి రానున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఉదయం 10:30 గంటలకు జరిగే యువ ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కానున్నారు. రెండు వేలకు పైగా యువత పాల్గొనే అవకాశం ఉన్నందున పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు.
పట్టణంలోని ప్రతి వార్డు నుంచి 50 మంది చొప్పున 39 వార్డులకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పార్టీ పట్టణాధ్యాక్షుడు జిందం చక్రపాణి తెలిపారు. కార్యకర్తలు, నాయకులు యువ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు.
-రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ)