పెద్దపల్లి/ పెద్దపల్లి రూరల్, నవంబర్ 1: ప్రజలే బీఆర్ఎస్ బలం..బలగం అని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి అన్నారు. 14 ఏండ్లు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ.. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో వడివడిగా అభివృద్ధివైపు అడుగులేస్తున్నదని చెప్పారు. ఈ తరుణంలో ఢిల్లీ పార్టీలో చేతిలో ఆగంకాక తప్పదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చేసిన పనులను చూసి మళ్లీ కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తిచేశారు. బుధవారం పెద్దపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో బీఆర్ఎస్ సీనియర్ నేత పూల్లూరి శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో జూలపల్లి మండలం వడ్కాపూర్కు చెందిన సు మారు 500 మంది, అలాగే తొలిసారిగా ఓటు హ క్కు పొందిన 50 మంది గులాబీ పార్టీలో చేరారు.
వీరికి దాసరి మనోహర్రెడ్డి రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి సర్ధార్ రవీందర్సింగ్తో కలిసి గులా బీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే పెద్దపల్లి మండలం పెద్దకల్వల, నిట్టూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఆయా గ్రామాల్లో మ హిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. యువకులు పూలవర్షం కురిపించారు. అనంతరం ఆయాచోట్ల మాట్లాడారు. సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో తెలంగాణను అన్నింటా దేశానికే దిక్సూచిగా నిలిపారని కొనియాడారు.
నిరంతర కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతుపక్షపాతిగా నిలిచారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, బీసీబంధు, మైనార్టీ బంధులాంటి స్కీంలతో పేదల బతుకుల్లో వెలుగులు నింపారన్నారు. అరవై ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇస్తున్నదని మండిపడ్డారు. ప్రజ లు ఆలోచించాలని అభివృద్ధి చేసేవారిని ఆదరించాలని కోరారు. బీఆర్ఎస్ను మళ్లీ గెలిపిస్తే తెల్లరేషన్కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని, రూ. 400 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. రవీందర్సింగ్ మాట్లాడుతూ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామం గులాబీమయమైంది. గ్రామానికి మహిళలు, పురుషులు, యువతి, యువకులు దాదాపు 500 మంది ఎమ్మెల్యే దాసరి సమక్షంలో బీఆర్ఎస్లో చేశారు. దీంతో 70 శాతం మంది బీఆర్ఎస్ వైపు ఉన్నట్లు సర్పంచ్ మహంకాళి తిరుపతి తెలిపారు. అలాగే యువ ఓటర్లు సైతం గులాబీ పార్టీకి జైకొట్టారు.
కార్యక్రమంలో జూలపల్లి ఎంపీపీ కూసుకుంట రమాదేవీ రాంగోపాల్రెడ్డి, సర్పంచ్ మహంకాళి తిరుపతి, వైస్ ఎంపీపీ మొగురం రమేశ్, నేతలు పూల్లూరి రాజేశ్వర్రావు, సీ సత్యనారాయణరెడ్డి, వేముల రామ్మూర్తి, నాయకులు కృ పాకర్రావు, ఎర్రోళ్ల రాములు, కొండయ్య, తమ్మడబోయిన మల్లేశం, కత్తెర్ల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, అనగోని శ్రీనివాస్గౌడ్, అడప లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి పెద్దకల్వల, నిట్టూరులో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఆయా సందర్భాల్లో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి కండ్లముందరే ఉన్నదన్నారు. ఏ ఊరికి వెళ్లి తారురోడ్లు, శుభ్రమైన మురుగు కాలువలు కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ హాయాంలో, బీఆర్ఎ స్ పాలనలో జరిగిన అభివృద్ధిని భేరిజు వేసుకోవాలని విజ్ఞప్తిచేశారు.
మోసపూరిత హామీలతో ముందుకువస్తున్న కాంగ్రెస్ను నమ్మవద్దని కోరా రు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని అభ్యర్థించారు. ఇక్కడ ఎంపీపీలు బండారి స్రవంతీ శ్రీనివాస్గౌడ్, పొన్నమనేని బాలాజీరా వు, పార్టీ మండలాధ్యక్షుడు మర్కులక్ష్మణ్, ఎంపీటీసీ జక్కుల రుక్కమ్మా లక్ష్మీనారాయణ, మండల కన్వీనర్ మేకల లక్ష్మన్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షుడు పెగడ శ్రీనివాస్ యాదవ్, నేతలు నర్ల పోల్రాజ్యాదవ్, నర్ల అంజయ్య యాదవ్, సలేంద్ర కొమురయ్య యదవ్, సలేంద్ర రాములు యా దవ్, పయ్యావుల కొమురయ్యయాదవ్, కల్వల రవి, నర్ల బాపు, బత్తుల లింగయ్య, సలేంద్ర శ్రీనివాస్, రమేశ్, శ్రీనివాస్, సంతోష్, గోపాల్, శంకరయ్య, సది. నర్ల సాయి యాదవ్, పర్స సురేష్ యాదవ్, శ్రీకాంత్, తీగల ధర్మపురి, అర్కుటి రామస్వామి యాదవ్, చిన్నకల్వల విండో చైర్మన్ మోహన్రావు, సర్పంచ్ ఆరెపల్లి కవితావెంకట్రా జం, గాండ్ల సతీశ్, ఆకుల సువర్ణ శ్రీనివాస్, మా దారపు వేణుగోపాల్రావు ఉన్నారు.
పెద్దపల్లి టౌన్ నవంబర్ 1: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం పెద్దపల్లిలో జిల్లా భవన నిర్మాణ సం ఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. భవన నిర్మాణ కా ర్మికుల కోసం ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించిందని గుర్తుచేశారు. వీరికి పక్కా భవానాల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా భవన నిర్మాణ సంఘం నాయకులను శాలువాలతో సత్కరించారు.
భవన నిర్మాణ సంఘాల నా యకులు పెద్దపల్లి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజుకుమార్, కౌన్సిలర్లు పూదరి చంద్రశేఖర్, గాదె మాధవి, భవన నిర్మాణ సంఘాల నాయకులు వడ్లకొండ లింగమూర్తి,రాఘవపూర్ సదయ్య, శ్రీకాంత్, గజ్జెల కనుకయ్య, చంద్రగిరి ఉదయ్కుమార్, రా జేశం, తగరం నరేశ్, కల్లెపల్లి రవి, శ్రీనివాస్, వల్లెపు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.