సిరిసిల్లటౌన్/ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 12: కృష్ణా నది జలాలపై తెలంగా ణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్ర భుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఈనెల 13న నిర్వహించే చలో నల్లగొండ భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణాధ్యక్షు డు జిందం చక్రపాణి పిలుపునిచ్చారు. సో మవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాల పోరాట సభను విజయవంతం చే యడం ప్రతి కార్యకర్త బాధ్యత అని స్పష్టం చేశారు.
వేలాదిగా తరలివెళ్లి సభను విజయవంతం చేయాలని సూచించారు. కా ర్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్ర వీణ్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ సీనియర్ నేత బొల్లి రామ్మోహన్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రా మాల్లో పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ మండల నాయకులు సోమవారం సమావేశమయ్యా రు. నల్లగొండ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ మండలాధ్యక్షుడు సురేందర్రావు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, నాయకులు విజయరామారావు, నిమ్మ దేవిరెడ్డి, తదితరులు ఉన్నారు.
చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులతో మండలాధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య సమావేశమయ్యారు. నల్లగొండ జిల్లాలో జరిగే కేసీఆర్ బహిరంగ సభకు కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు, సోషల్ మీడియా వారియర్స్, పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జడ్పీటీసీ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణులు సమావేశమయ్యారు. నల్లగొండలో మంగళవారం నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి పిలుపునిచ్చారు. ఇక్కడ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, వైస్ఎంపీపీ కదిరె భాస్కర్, నాయకులు పందిళ్ల పరశురాములు, కర్రోళ్ల ఆంజనేయులు, కురుకుంట్ల డేవిడ్ ఉన్నారు.