గంభీరావుపేట, జూలై 11: మంత్రి కేటీఆర్ సహకారంతోనే గంభీరావుపేట సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్పష్టం చేశారు. గంభీరావుపేట రోడ్డు విస్తరణకు 30 కోట్లు, హైలెవల్ వంతెనకు 13 కోట్ల 50 లక్షలు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు మంగళవారం సంబురాలు జరుపుకున్నారు. లింగన్నపేట నుంచి పెద్దమ్మ స్టేజీ వరకు ‘థాంక్యూ కేటీఆర్’ అంటూ ప్లకార్డులతో బైక్ ర్యాలీ తీశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద పటాకలు కాల్చి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి ఎంపీపీ, సర్పంచ్, నేతలతో కలిసి పాలాభిషేకం చేశారు.
తోట ఆగయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంత్రి కేటీఆర్ సహకారంతో గంభీరావుపేటను దశల వారీగా అభివృద్ధి చేసుకుంటున్నామని, అందులో భాగంగా మండల రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేసిన మంత్రికి రుణపడి ఉంటామన్నారు. మండల కేంద్రంలో 3 కిలో మీటర్లు రోడ్డు విస్తరణ చేసి డివైడర్, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, తదితర వసతులు ఏర్పాటు చేయడం వల్ల గంభీరావుపేట ప్రజల చిరకాల ఆకాంక్ష నెరువేరనున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ, సర్పంచ్ కటకం శ్రీధర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్, ఆర్బీఎస్ కన్వీనర్ రాజేందర్, వైస్ ఎంపీపీ దోసల లత, ఉపసర్పంచ్ నాగరాజుగౌడ్, నేతలు వంగ సురేందర్రెడ్డి, లింగన్నగారి దయాకర్రావు, కమ్మరి రాజారాం, గంద్యాడపు రాజు, పెద్దవేని వెంకటియాదవ్, లింగంయాదవ్, రెడ్డిమల్ల రాజనర్సు, హన్మంతరెడ్డి, రత్నాకర్, సురేశ్, వెంకటస్వామిగౌడ్, చెవుల మల్లేషం, దోసల రాజు, తలారి అంజనేయులు, దుబాసి రాజు, వహీద్, కోల రాజు, రాజేందర్, బిల్లా గోపాల్, పిట్ల శ్రీమతి, నిరంజని, సత్తవ్వ, నివాస్గౌడ్, కిషోర్, బాబు, సంతోష్రెడ్డి పాల్గొన్నారు.