మానకొండూర్, జనవరి 25: ‘బండి సంజయ్కు సభ్యత, సంస్కారం లేదు. హిందూ సంప్రదాయాలపైన ఏమాత్రం గౌరవం లేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నడు? మేమొక్కటే చెబుతున్నాం. బండి నోరు అదుపులో పెట్టుకో… భాష మార్చుకో.. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు’ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్ హెచ్చరించారు. మానకొండూర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్లో రెండుజుల క్రితం నిర్వహించిన బీఆర్ఎస్ సోషల్మీడియా వారియర్స్ మీటింగ్ సక్సెస్ కావడంతో బండికి గుండెల్లో దడ పుట్టిందన్నారు. ఆ సమావేశంలో కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు మాజీ ఎంపీ వినోద్తో రావాలని కేటీఆర్ సవాల్ విసిరితే సంజయ్ తోకముడిచారని విమర్శించారు.
ప్రెస్మీట్ పెట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడాడని, సవాల్ను స్వీకరించకపోవడం సిగ్గుచేటన్నారు. సంజయ్ మతాలు, దేవుడి పేరిట రాజకీయాలు చేయడం తప్ప గడిచిన ఐదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి చేసిందేమి లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కేసీఆర్ వెంట నడిచిన వ్యక్తి వినోద్కుమార్ అని గుర్తు చేశారు. మన ప్రాంతానికి జరిగిన అన్యాయంపై హైకోర్టు, సుప్రీం కోర్టులో పోరాడిన వ్యక్తిగా, ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ వాదిగా, నైపుణ్యం కల వ్యక్తిగా కేసీఆర్కు దగ్గర అయ్యాడే తప్ప బండిలా ఢిల్లీ పెద్దల చెప్పులు మోసి అదిష్ఠానానికి దగ్గర కాలేదని విమర్శించారు. బండి సంజయ్ చేస్తున్న మత రాజకీయాలు, వినోద్ కుమార్ హయాంలో జరిగిన కరీంనగర్ అభివృద్ధిపై ప్రజలు చర్చించుకుంటున్నారని, రాబోయే రోజుల్లో కరీంనగర్ ఎంపీగా వినోద్ భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని స్పష్టం చేశారు.
జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ, బండి సంజయ్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. హిందూ సంప్రదాయాల్లో తల్లిదండ్రులను గౌరవిస్తారని, అలాంటిది తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ను ‘నీ అయ్యా’ అని సంబోధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక్కడ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, సీనియర్ నాయకులు గడ్డం నాగరాజు, మానకొండూర్, ముంజంపల్లి సర్పంచులు రొడ్డ పృధ్వీరాజ్, రామంచ గోపాల్రెడ్డి, బీఅర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ మధుసూధన్రెడ్డి, నాయకులు శాతరాజు యాదగిరి, తిరుపతి నాయక్, ఎరుకల శ్రీనివాస్గౌడ్, పిట్టల మధు, నెల్లి శంకర్, పిండి సందీప్, రామగిరి ఆంజనేయులు, బొల్లం అనిల్ పాల్గొన్నారు.