కార్పొరేషన్/కమాన్చౌరస్తా/కొత్తపల్లి/ కరీంనగర్ రూరల్/ముకరంపుర, ఫిబ్రవరి 17: కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో 70 కిలోల కేక్ ఏర్పాటు చేయగా, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ యాదగిరి సునీల్రావు హాజరై కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి సాధించిన యోధుడని పేర్కొన్నారు. సీఎంగా కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, వాల రమణారావు, ఐలేందర్యాదవ్, నాయకులు ఆరె రవి, చంద్రశేఖర్, కిరణ్, శ్రీనివాస్రెడ్డి, మైకెల్ శ్రీను, సూర్యశేఖర్, పవన్, మారుతి, రాజు తదితరులు పాల్గొన్నారు.
మేయర్ యాదగిరి సునీల్రావు ఆధ్వర్యంలో కళాభారతి, జిల్లా గ్రంథాలయం, ప్రభుత్వ వైద్యశాలలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కళాభారతి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని నగరంలో చేపడుతున్న రూ.5 భోజన పథకంలో భాగంగా రూ.29 చొప్పున రూ.35,300 చెల్లించి 1300 మందికి అన్నదానం చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు ఎదుర్ల రాజశేఖర్, తోట రాములు, సరిళ్ల ప్రసాద్, అజిత్రావు, నాయకులు సదానందచారి, మైకెల్ శ్రీను, శేఖర్, అనిల్, హమీద్ పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్కుమార్ ఆధ్వర్యంలో మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బీఆర్ఎస్వీ నాయకులు చుక్కా శ్రీనివాస్, ఆరె రవిగౌడ్, బొంకూరి మోహన్, నారదాసు వసంత్, పరశురాం, అనంతుల రమేశ్, పబ్బతి శ్రీనివాస్రెడ్డి, వరప్రసాద్, కిరణ్గౌడ్, అశోక్ పాల్గొన్నారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్సింగ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బూట్లు, సాక్సులు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, రాములు పాల్గొన్నారు. స్థానిక వృద్ధాశ్రమంలో బీఆర్ఎస్ నాయకుడు పెండ్యాల మహేశ్కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నాయకులు శ్రావణ్, హరిప్రసాద్ పాల్గొన్నారు. స్థానిక కరీముల్లాషా దర్గాలో బీఆర్ఎస్ నాయకులు మజీద్, ఆరీఫ్, ఇమ్రాన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
శాతవాహన యూనివర్సిటీలో నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్వీ ఎస్యూ ఇన్చార్జి చుక శ్రీనివాస్, మోహన్, శశాంక్, సాయి కృష్ణారెడ్డి, శివ, అక్షయ్, పవన్కుమార్, సంతోష్ వర్మ, మహేందర్, రాజ్కుమార్, అభిషేక్, రాకేశ్, పవన్, రాకేశ్, అశోక్ పాల్గొన్నారు. కొత్తపల్లి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, చింతకుంటలో ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్ కేక్ కట్ చేశారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ మధు, ఎంపీటీసీ తిరుపతి నాయక్, రాజశేఖర్, జమీలొద్దీన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. టీఆర్వీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి కోడూరి ప్రకాశ్ ఎర్రవల్లిలోని క్షేత్రంలో కేసీఆర్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్వీకేఎస్ డైరీ, క్యాలెండర్ను అందజేశారు.
చొప్పదండి/ రామడుగు(చొప్పదండి)/ గంగాధర, ఫిబ్రవరి17: చొప్పదండి పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంపీటీసీలు, పార్టీ నాయకులు కేక్కట్ చేసి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్కుమార్, సింగిల్ విండో చైర్మన్ మినుపాల తిరుపతిరావు, కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు పాషా, నాయకులు గన్ను శ్రీనివాస్ రెడ్డి, వెల్మ నాగిరెడ్డి, తిరుపతిరెడ్డి, దండె కృష్ణ, మహేశుని మల్లేశం, మారం యువరాజ్, జహీర్, రావన్, కుమార్, శ్రీనివాస్రెడి,్డ మల్లేశం, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
రామడుగు మండలం వెలిచాలలోని ప్రశాంత్ భవన్లో పిల్లలకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు కోడిగుడ్లు, చికెన్, బ్రెడ్స్, బియ్యం, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం భవన్ ఆవరణలో పిల్లలతో కలిసి మొకలను నాటారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్ రెడ్డి, కొకెరకుంట సింగిల్ విండో చైర్మన్ ఒంటెల మురళీ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ మారొండ కిష్టారెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు వీర్ల సంజీవరావు, మారెట్ కమిటీ మాజీ చైర్మన్లు మామిడి తిరుపతి, గంట్ల వెంకటరెడ్డి, లచ్చయ్య, ఎంపీటీసీ వంచ మహేందర్ రెడ్డి, నాయకులు కలిగేటి లక్ష్మణ్, గూడూరు మల్లేశం, మాజీ సర్పంచులు వీర్ల రవీందర్రావు, బండ అజయ్ రెడ్డి, శేఖర్, ఒంటెల వెంకటరమణారెడ్డి, జూపాక మునీందర్, సైండ్ల కరుణాకర్, గుండి ప్రవీణ్, ఉప సర్పంచ్ పూదరి వెంకటేశ్, దొబ్బల మధు, మారెట్ డైరెక్టర్లు రాజేశం, సురేశ్, గ్రామాధ్యక్షులు మహేశ్, లక్ష్మణ్, నాయకులు శ్రీనివాస్, ప్రశాంత్, వెంకట్ రమణ, అనిల్, కుమార్, సుధాకర్, నారాయణ, సురేశ్, పవన్, విద్యాసాగర్, సంజీవ్, శేఖర్, పోశెట్టి, రాజు పాల్గొన్నారు. గంగాధర మండలం బూరుగుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. స్థానిక హనుమాన్ ఆలయంలో మొక్కలు నాటారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గట్టుభూత్కూర్లో మాజీ సర్పంచ్ కంకణాల విజేందర్రెడ్డి కేక్ కట్ చేసి, పండ్లు పంచారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, నాయకులు సాగి మహిపాల్రావు, వేముల దామోదర్, రామిడి సురేందర్, వేముల అంజి, దూలం శంకర్గౌడ్, సుంకె అనిల్, రాసూరి మల్లేశం, బొల్లాడి శ్రీనివాస్రెడ్డి, ముక్కెర మల్లేశం, మాల చంద్రయ్య, ద్యావ మధుసూదన్రెడ్డి, ఆకుల మధుసూదన్, ఎండీ నజీర్, వడ్లూరి ఆదిమల్లు, పుట్కం ఠాగూర్, మడ్లపెల్లి రమేశ్, దోమకొండ మల్లయ్య, గంగాధర రాజయ్య, ఎండీ అబ్బాస్, తూం మల్లారెడ్డి, ద్యావ సంజీవ్, గంగాధర కుమార్, అజయ్, గంగాధర శ్రీకాంత్, గంగాధర నగేశ్, గంగాధర మోహన్ తదితరులు ఉన్నారు.
కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్లో నిర్వహించిన వేడుకల్లో మాజీ సర్పంచ్ జక్కం నర్సయ్య, ప్రధానోపాధ్యాయిని పద్మ, ఎస్ఎంసీ చైర్మన్ అంజయ్య, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు అశోక్, రమేశ్, యాదగిరి, సదానందం, నాగరాజు, శ్రీనివాస్, ఉపేందర్, సంజయ్ పాల్గొన్నారు. చెర్లభూత్కూర్లోని వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో బీఆర్ఎస్ నాయకుడు శ్యాంసుందర్రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. మాజీ సర్పంచ్ రమణారెడ్డి, ఎంపీటీసీ తిరుపతి గౌడ్, లక్ష్మణ్, శ్రీనివాస్, మధు, హన్మంత్రావు, రమేశ్గౌడ్, అనంత రెడ్డి, అజయ్ పాల్గొన్నారు. చామనపల్లి బస్టాండ్ చౌరస్తాలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు తిరుపతి గౌడ్, దుర్శేడ్ ఉప సర్పంచ్ సంపత్రావు, నాయకులు శ్రీనివాస్గౌడ్, శ్యాంసుందర్ రెడ్డి, రంగారెడ్డి, రాజిరెడ్డి, సుదర్శన్రెడ్డి, చంద్రారెడ్డి, రాంరెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.
మానకొండూర్/ శంకరపట్నం/ తిమ్మాపూర్/ రూరల్/ చిగురుమామిడి/ గన్నేరువరం, ఫిబ్రవరి 17: మానకొండూర్ మండల కేంద్రంలోని పల్లెమీద చౌరస్తా వద్ద నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకలకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, సీనియర్ నాయకుడు గడ్డం నాగరాజు, మానకొండూర్ సింగిల్విండో అధ్యక్షుడు నల్ల గోవిందరెడ్డి, బీఆర్ఎస్వై నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేశ్, మండలాధ్యక్షుడు అడప శ్రీనివాస్, బీఆర్ఎస్వీ నియోజకవర్గ కన్వీనర్ గుర్రం కిరణ్గౌడ్, కార్యదర్శి మర్రి అశోక్యాదవ్, నాయకులు రొడ్డ పృథ్వీరాజ్, రామంచ గోపాల్రెడ్డి, శాతరాజు యాదగిరి, ఎరుకల శ్రీనివాస్గౌడ్, పడాల సతీశ్, పిట్టల మధు, దండబోయిన శేఖర్, బొల్లం శ్రీనివాస్, ఇస్కుల్ల ఆంజనేయులు, పిండి సందీప్, రామగిరి ఆంజనేయులు, ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
శంకరపట్నం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు, పండ్లు పంచి పెట్టారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గాండ్ల తిరుపతయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె సంజీవరెడ్డి, ఉమ్మెంతల సతీశ్రెడ్డి, అంతం తిరుపతిరెడ్డి, గుర్రం రామస్వామి, గజెల్లి హన్మంతు, పోచయ్య, భూమ తిరుపతి, గొడిశాల తిరుపతి, గూల్ల రమేశ్, మొలుగూరి శ్రీనివాస్, మన్సూర్, రాజిరెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, కోటి తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని మానసిక వికలాంగుల పాఠశాలలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కేక్ కట్ చేయించి వేడుకలు చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, పాశం అశోక్ రెడ్డి, మండల, గ్రామాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. పర్లపల్లిలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ముప్పిడి సంపత్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఉపసర్పంచ్ సుద్దాల రాజేశ్, బీసీ సెల్ అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు, మాజీ వార్డు సభ్యులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండలాధ్యక్షులు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు.
జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి, సాంబారి కొమురయ్య, వైస్ ఎంపీపీ భేతి రాజిరెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, నాయకులు బెజ్జంకి రాంబాబు, ఎస్కే సిరాజ్, బుర్ర తిరుపతి, ముకెర సదానందం, దుడ్డెల లక్ష్మీనారాయణ, కల్వల సంపత్ రెడ్డి, పెనుకుల తిరుపతి, సన్నీళ్ల వెంకటేశ్, సుద్దాల ప్రవీణ్, శ్యామకూర సంపత్ రెడ్డి, పెసరి రాజేశం, అనుమాండ్ల సత్యనారాయణ, మాంకాళి అజయ్, అవినాష్ రెడ్డి, నారాయణ పాల్గొన్నారు. గన్నేరువరంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్నాసుధాకర్, బీఆర్ఎస్ మహిళా మండలాధ్యక్షురాలు నవీన, రవి, రాములు తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్టౌన్/ జమ్మికుంట/ ఇల్లందకుంట/ సైదాపూర్/ వీణవంక, ఫిబ్రవరి17: హుజూరాబాద్లో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేశారు. బల్దియా చైర్పర్సన్ గందె రాధిక, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు వర్దినేని రవీందర్రావు, మున్సిపల్ కౌన్సిలర్లు బర్మావత్ యాదగిరినాయక్, కల్లెపల్లి రమాదేవి, కేసిరెడ్డి లావణ్య, తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, ముక రమేశ్, మక్కపెల్లి కుమార్యాదవ్, అపరాజ ముత్యంరాజు, కొండ్రా జీవితానరేశ్, ఉజ్మా నూరిన్ ఇమ్రాన్, ప్రతాప మంజులాకృష్ణ, పార్టీ మండలాధ్యక్షుడు సంగెం ఐలయ్య, లారీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ సలీం, సీనియర్ నాయకులు పంజాల కుమారస్వామి, పీ సదానందం, కొయ్యడ శ్రీదేవి, కే దోని, కొలిపాక సమ్మయ్య, రాపర్తి శివ, పంజాల శ్రీధర్, మక్కపెల్లి రమేశ్యాదవ్, కెక్కర్ల సారయ్యగౌడ్, రాంరెడ్డి, సబ్బని సదానందం, మోరె మధు, ఎం శ్రీనివాస్, భాస్కరాచారి పాల్గొన్నారు.
జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ రాజ్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నాకోటి, కౌన్సిలర్లు భాస్కర్, శ్రీనివాస్, నరేశ్, నాయకులు మనోహర్రావు, లింగారావు, దిలీప్, వెంకటేశ్, రమేశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లందకుంటలో ఎంపీపీ సరిగొమ్ముల పావనీవెంకటేశ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. కార్యక్రమంలో నాయకులు ఓదెలు, చిన్నరాయుడు, ఐలయ్య, మాజీ సర్పంచులు, నాయకులు ఉన్నారు. సైదాపూర్ మండలకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంతో పాటు ఎక్లాస్పూర్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు, పండ్లు పంచారు.
ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్లు కొత్త తిరుపతిరెడ్డి, బిల్ల వెంకటరెడ్డి, నాయకులు చెల్మల్ల రాజేశ్వర్రెడ్డి, గుండేటి శ్రీనివాస్, ముత్యాల వీరారెడ్డి, అబ్బిడి రవీందర్రెడ్డి, బద్దిపడిగ రవీందర్రెడ్డి, కొత్త రాజిరెడ్డి, కూతురు విద్వాన్రెడ్డి, చిక్కుల సంపత్, లక్ష్మీనారాయణ, మోహన్రావు, శంకర్నాయక్, స్వామి, సురేశ్, శ్రీనివాస్, అనిల్, మహేందర్, హరీశ్, స్వామి, నాయకులు పాల్గొన్నారు. వీణవంక మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో శనివారం ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు, పండ్లు పంచారు. జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సింగిల్విండో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, మాజీ సర్పంచులు నర్సయ్య, రమేశ్, ముత్తయ్య, అడిగొప్పుల సత్యనారాయణ, మాజీ ఉపసర్పంచ్ గెల్లు శ్రీనివాస్, గ్రామాధ్యక్షుడు మహేశ్, నాయకులు ఎండీ యాసిన్, మధు, కొండల్రెడ్డి, అజయ్, రాజయ్య, పున్నం, రాజు, ఓదయ్య, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.