Dharmaram | ధర్మారం, ఆగస్టు 7 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. బొమ్మరెడ్డిపల్లి గ్రామంతో పాటు కొత్తపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలలో సంయుక్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.
ఈ ఉత్సవాలకు ఐసీడీఎస్ సూపర్వైజర్ బ్లాండీన హాజరై తల్లులు, బాలింతలు, గర్భవతులకు తల్లి పాల విశిష్టత గురించి వివరించారు. పుట్టిన శిశువుకు తల్లి ముర్రుపాలు పట్టించాలని సూచించారు. ముర్రుపాలు వల్ల శిశువులో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యకరంగా ఉంటారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల అంగన్వాడీ టీచర్లు బుర్ర రేణుక, మంగ రాణి, అరుణ, బుచ్చవ్వ, కవిత, ఆయాలు పాల్గొన్నారు.