కరీంనగర్ కార్పొరేషన్/ కొత్తపల్లి, ఆగస్టు 4: కరీంనగర్ గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత బోనాల రాజేశం మృతికి మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామానికి చెందిన బోనాల రాజేశం (69) గురువారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. రాజేశం కమాన్పూర్ సర్పంచ్గా 17 ఏండ్లు, ఒకసారి ఎంపీటీసీగా, ఆరేండ్లు గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పనిచేశారు. ఒకసారి రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో ఆయన భార్యను ఎంపీటీసీగా గెలిపించుకొని ఎంపీపీని చేశారు. నాడు టీడీపీ నా యకుడిగా ఉన్న రాజేశం గతంలో మంత్రి గంగు ల కమలాకర్తో కలిసి టీఆర్ఎస్లో చేరారు. మండలంలో పార్టీ పటిష్టతకు, అభ్యర్థుల గెలుపునకు విశేషంగా కృషి చేశారు.
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గురువారం సాయంత్రం ప రిస్థితి విషమించడంతో జిల్లా కేంద్రంలోని రాంనగర్లోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. విష యం తెలియగానే మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మేయర్ వై సునీల్రావు, చల్ల హరిశంకర్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్గౌడ్, మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. అలాగే కరీంనగర్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మ య్య, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, మాజీ జడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు, మండల నాయకులు ఎంపీటీసీలు, నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కమాన్పూర్లో స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీపీ వాసాల రమేశ్ తెలిపారు.