వేములవాడ, నవంబర్ 2: మున్సిపల్ పరిధిలోని ఇంటింటికీ తిరిగి గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లడగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. గురువారం పట్టణంలోని చల్మెడ నివాసంలో కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులతో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావుతో కలిసి సమావేశమై, మాట్లాడారు.
ఈ నెల 6న నియోజకవర్గ స్థాయిలో చేపట్టనున్న విద్యారి,్థ యువజన సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి గ్రామం నుంచి పెద్దఎత్తున యువకులు హాజరయ్యే విధంగా ప్రణాళికాబద్ధంగా నడుచుకొని సభను విజయవంతం చేయాలన్నారు.
పురపాలక సంఘం పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వివరిం చి ఓటు అభ్యర్థించాలన్నారు. ఎన్నికల సమ యం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతిఒక రూ వార్డులోనే ఉం టూ.. అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ మాట్లాడుతూ, బూత్స్థాయి కమిటీలు తప్పనిసరిగా ప్రతి ఓటరునూ కలిసి ఓటడుగాలని సూచించారు. అందరూ సమష్టిగా కృషి చేసినప్పుడే విజయం సిద్ధిస్తుందన్నారు. ప్రతిఒక్కరూ కష్టపడి పని చేసి కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రి చేద్దామన్నా రు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవి, పార్టీ అధ్యక్షుడు పులం రాజు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.