Karimnagar | కమాన్ చౌరస్తా, ఆగస్టు 20 : పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదినం సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత పిలుపు మేరకు కరీంనగర్లో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ముందస్తుగా గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. మెగా యూత్ ఫోర్స్ కరీంనగర్ నాయకులు గాలిపెల్లి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల వెంకటేష్, తెలంగాణ మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ కాస రాజు, ఉత్తర తెలంగాణ కన్వీనర్ మిడిదొడ్డి కపిల్ మాధవ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు కోడూరి హరికృష్ణ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వేల్పుల వెంకటేష్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా మెగా బ్రదర్స్ స్ఫూర్తితో అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
మెగా హీరోల జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రతీ ఏడాది రక్తదాన శిబిరాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మెగా యూత్ ఫోర్స్ అభిమానులు, కార్యకర్తలను అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో గాలి శ్రీనివాస్, సుల్తాన్, మురళితో పాటు పలువురు మెగా అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తాటిపల్లి ప్రభు, ఫహద్, మామిండ్ల కిరణ్, వడ్లూరి శ్రీనివాస్, గాలిపెల్లి కుమార్, నాగరాజు, కరుణాకర్, మంథని సూరి, గాలి శ్రీను, విజయ్, వినయ్, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.