Challur | వీణవంక, మార్చి 23 : వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో సోమవారం స్వాతంత్య్ర సమరయోధుడు భగత్సింగ్ 94వ వర్ధంతిని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విప్లవ వీరకిషోరాలు భగత్సింగ్, రాజ్గురుతో పాటు మహనీయుల చరిత్రను ప్రభుత్వ పుస్తకాల్లో ప్రభుత్వ అంశాలుగా చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్, మండల కార్యదర్శి పిల్లి రవియాదవ్, నాయకులు గుంపుల సంపత్, ఎండీ సమరొద్దీన్, జి.సంపత్, పోచాలు, పొన్నాల సది, సమ్మయ్య, యోబు, శ్రీనివాస్, మల్లారెడ్డి, గడ్డం కుమార్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.