ACB | సారంగాపూర్, ఆగస్టు 13 : బీర్ పూర్ మండల కేంద్రంలో ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీర్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. ఓ బాధితురాలి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటున్న గిరిధావర్(ఆర్) రాహుల్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఈ ఘటనపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. కాగా ఆర్ఐ రాహుల్ గతంలో కథలాపూర్ ఆర్ఐ-1 గా విధులు నిర్వహించగా సర్టిఫికెట్ల జారీలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడంతో బీర్పూర్ కు బదిలీ చేశారు. కాగా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది.