జగిత్యాల : భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ (Jagjivan Ram statue) విగ్రహాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలో వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడే డాక్టర్ పేట భాస్కర్ డిమాండ్ చేశారు. గత పదకొండు సంవత్సరాలుగా భూమి పూజతోనే చేతులు దులుపేసుకుంటున్నారని ఆరోపించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్ లో మంగళవారం జరిగిన మాదిగ సంఘాల సమావేశంలో పేట భాస్కర్ మాట్లాడారు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం తీసుకువచ్చి రోజులు గడుస్తూ మూలన మగ్గుతున్న దాన్ని నెలకొల్పడంలో చలనం లేదని, ఇకనైనా జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని ఈనెల 5న జరగబోయే జయంతోత్సవాలకు విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, జయంతోత్సవాల కమిటీ ప్రతినిధులు నక్క విజయ్, బొల్లి శేఖర్, బెజ్జెంకి సతీస్, బంగారు దీపక్, దుమాల రాజ్ కుమార్, బొనగిరి దేవయ్య , బొల్లే గంగారాం, బొల్లంపల్లి సంపత్ కుమార్, కొంగర పవన్, గజ్జెల రాజు, నక్క రమేష్,ముదిగం రాజేందర్, దాసరి సతీష్, బొనగిరి నారాయణ, పూడురి శోభన్ మాజీ ఎంపీపీలు దర రమేష్ బాబు, మకిల్ ఇజ్రయిల్ నాయకులు ఎస్ రాజయ్య, బి రాజ్ కుమార్, నక్క గంగాధర్, దుమాల గంగారాం, బడుగు రాజేందర్, సంగెపు ముత్తు పాల్గొన్నారు.