జగిత్యాల, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): మహిళలు శక్తివంతులుగా ఉన్నప్పుడే బలీయమైన సమాజం ఆవిష్కృ తం అవుతుందన్నది ఆర్యోక్తి. కానీ శతాబ్దాలుగా మహిళ అరోగ్య విషయాల్లో ఇబ్బందులు పడూతేనే ఉంది. కుటుంబం మేలు, సమాజం ఉన్నతి కోసం నిరంత రం తపించే ‘ఆమె’ ఆరోగ్యంపై సమా జం, కుటుంబం, చివరికి ఆమెకి ఆమె సై తం శీతకన్నువేస్తూనే ఉంది. దీంతో మహిళలు అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడి వి లువైన జీవితాన్ని కోల్పోతున్నారు. యత్ర నార్య స్తు పూజ్యతే.. తత్ర రమంతే దేవతా.. అన్న ఆర్యోక్తిని అక్షరాల నమ్మే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళ ఆరోగ్య రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మహిళలకు సంబంధించిన ప్రా ణాంతక వ్యాధులు, శారీరక, మానసిక ఇబ్బందులను ముందుగానే గుర్తించి అవసరమైనవారికి వైద్య సేవలు అందించేందుకు ముందడుగు వేసిం ది. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని మమిళలకు ప్రభుత్వ దవాఖానల్లో వైద్య పరీక్షలు చేయించి, అవసరమైతే వైద్యం, కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ‘ఆరోగ్య మహిళ’ పథకా న్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దాదాపు ఐదు వారాల క్రితం ప్రారంభమైన కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా ముందుకుసాగుతున్న ది. మహిళలు ఎదుర్కొనే కీలకమైన సమస్యలతో పాటు, ప్రాణాంతక వ్యాధుల నిర్ధారణ కోసం వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారిని ప్రధాన దవాఖానలకు రెఫర్ చేస్తున్నారు. జిల్లాలో ప్రారంభమైన ఐదు కేంద్రా ల్లో ఇప్పటివరకు (గత మంగళవారం వరకు) 645 మంది మహిళలకు పరీక్షలు చేశారు. ఇందు లో చాలా మందికి కౌన్సెలింగ్, మందులు అందజేశారు. ఆధునాతన పరీక్షలు నిర్వహిస్తూ మహిళల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు నారీలోకం ధన్యవాదాలు చెబుతున్నది.
జిల్లాలో ఐదు ఆరోగ్య మహిళ కేంద్రాలను ఏ ర్పాటు చేశారు. ప్రతి సెంటర్లో ప్రతి మంగళవా రం మహిళ వైద్యులు, సిబ్బంది మహిళలకు పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని రాంపూర్ బావి ఆరోగ్య కేంద్రంతో పాటు, ధర్మపురి, కొడిమ్యాల, కథలాపూర్, అల్లీపూర్ ఆరోగ్య కేంద్రాల్లో సెంటర్లు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు కేంద్రాల్లో నాలు గు వారాల్లో పెద్ద సంఖ్యలో మహిళలకు వివిధ రకాల పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కౌన్సెలింగ్ సైతం ఇచ్చారు. ధర్మపురి కేంద్రంలో 157 మంది, జగిత్యాల అర్బన్ కేంద్రంలోని ఆరో గ్య కేంద్రంలో 120, కొడిమ్యాల కేంద్రంలో 126, కథలాపూర్ కేంద్రంలో 119, అల్లీపూర్ కేం ద్రంలో 123 మందికి అంటే మొత్తంగా జిల్లాలో 645 మంది మహిళలకు పరీక్షలు చేశారు. ఇం దులో థైరాయిడ్తో బాధపడుతున్న ఇద్దరిని గు ర్తించారు. ఓరల్ క్యాన్సర్ విషయంలో 323 మం దికి స్క్రీనింగ్ పరీక్షలు చేయగా, అందులో ఒకరిని సస్పెక్ట్ చేసి జిల్లా దవాఖానకు రిఫర్ చేశారు. ఇక రొమ్ము క్యాన్సర్కు సంబంధించి 320 మందికి స్క్రీనింగ్ చేసి, ఇద్దరిని సస్పెక్ట్ చేసి జిల్లా దవాఖానకు రెఫర్ చేశారు. సర్వైకల్ క్యాన్సర్ విషయంలో 86 మందికి స్క్రీనింగ్ చేసి ఒకరిని రెఫర్ చేశారు. మోటోర్ న్యూరాన్ డీసీజ్ కోసం 287 మందికి పరీక్షలు చేసి, యూరినరీ ఇన్ఫెక్షన్, పాలిస్టిక్ ఓవ రీ సిండ్రోమ్ లాంటి టెస్టులు నిర్వహించారు. మో నోపాజ్ సమస్యలతో బాధపడుతున్న వారిలో 225 మందికి కౌన్సెలింగ్ చేసిన వైద్యులు 440 మందికి వైద్య సేవలు, మందులు అందజేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలల్లో రక్త హీనత కేసులు అధికంగా ఉంటుండడంతో వాటికి వైద్యం అందజేస్తున్నారు. 7 గ్రాముల లోపు రక్తం ఉన్న వారిని ఇద్దరిని గుర్తించి వారికి అత్యవసర వైద్యం అందించారు. ఇక 7 నుంచి 9 గ్రాముల మధ్యలో 133 మందిని, 10 నుంచి 10.9 గ్రా ముల మధ్య ఉన్న 203 మందిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించడంతోపాటు రక్తహీనతను అధిగమించేందుకు మందులు అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టిన ఆరోగ్య మహిళ కేంద్రాలు గ్రామీణ మహిళలకు ఎంతో ప్రయోజనకరం అని చెప్పాల్సిందే. సమాజం ఎంత అభివృద్ధి చెందినా గ్రామీణ ప్రాంత మహిళలు అనేక ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా స్త్రీల ఆరోగ్య సమస్యలపై వారికే సరైన అవగాహన లేకుండా పోయింది. కొంత అవగాహన ఉన్నప్పటికీ దవాఖాన వరకు వచ్చి ధైర్యంగా చూపించుకోలేకపోతున్నా రు. దీంతో సమస్యలు ముదిరిపోయి, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నా రు. ఈ పరిస్థితుల్లో కేవలం మహిళల కోసమే ఆరోగ్య మహిళ కేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఇక్కడ ఎనిమిది రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రాణాంతకమైన రొమ్ము, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. టీహబ్ సహకారంతో 64 రకాల రక్తపరీక్షలు అందుబాటులో ఉన్నాయి. నాలుగు వారాలుగా ఆరోగ్య కేంద్రాల్లోకి మహిళలు వస్తున్నా రు. ప్రధాన సమస్యలపై స్క్రీనింగ్ నిర్వహించి అవసరమైతే రెఫర్ చేస్తున్నాం. ముఖ్యంగా మహిళలు మోనోపాజ్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే రక్తహీనత అనేది చాలా అధికంగా కనిపిస్తోంది. ఈ సమస్యలకు వైద్యంతో పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. ఆరోగ్య మహిళ కేంద్రాలు విజయవంతంగా ముందుకు పోతున్నాయి. మహిళల్లోను ఇప్పుడిప్పుడే ఆరోగ్యపరమైన అంశాలపై కొంత అవగాహన ప్రారంభమైంది.
– డాక్టర్ పరమేశ్వరి, కొడిమ్యాల ఆరోగ్య మహిళా కేంద్రం వైద్యురాలు
మహిళ ఆరోగ్యాన్ని రక్షించేందుకు ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఇంట్లో ఉండే నాలాంటి మహిళలకు ఎప్పుడు కుటుంబం మంచి చెడులపైనే దృష్టి తప్పా, ఆరోగ్యంపై దృష్టి ఉండదు. ఒకవేళ కాస్త టైం దొరికి ఆరోగ్యంపై దృష్టి పెడుదామనుకున్నా.. దవాఖానలు దూరంగా ఉండడం, ప్రభుత్వ దవాఖానలకు వెళితే అక్కడ మహిళ వైద్యురాళ్లు సరిగా లేకపోవడం, ఉన్నా, చాలా సేపు వెయిట్ చేయాల్సి రావడంతో చాలా మంది వైద్యశాలలకు వెళ్లడం లేదు. దీంతో చిన్నచిన్న అనారోగ్య సమస్యలు సైతం ముదిరిపోయి పెద్దవై పోతున్నాయి. ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కొడిమ్యాల లాంటి మండల కేంద్రంలో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం వారంలో ఒక్కరోజు ఆడవాళ్లకు మాత్రమే పరీక్షలు చేయడం, మందులు ఇవ్వడం, సలహాలు, సూచనలు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. కొడిమ్యాలలో పరీక్షలు చేస్తున్నారని తెలుసుకొని, చెప్యాల నుంచి వచ్చి పరీక్షలు చేయించుకున్నా. విటమిన్ల లోపం ఉందని, బలహీనంగా ఉన్నావని చెప్పి మందులు అందజేశారు. ఆడవారి ఆరోగ్యం కోసం ఇంతగా కృషి చేస్తున్న సర్కార్కు ధన్యవాదాలు.
– ఉట్కూరి మంజుల, చెప్యాల
కొడిమ్యాలలో ఆరోగ్య మహిళ కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ఈ కేంద్రంలో పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన. గతంలో అన్ని పరీక్షల కోసం జగిత్యాల, లేదంటే కరీంనగర్ వెళ్లేవాళ్లం. దూరభారంతో పాటు, ఖర్చు ఎక్కువయ్యేది. ఇప్పుడా ఇబ్బంది లేకుండా పోయింది. డబ్బులు, సమయం ఆదా అవుతుంది. పరీక్ష కేంద్రంలో 64 రకాల రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యంపై ప్రాథమిక సూచనలు చేయడంతో పాటు, స్క్రీనింగ్ చేసి, అవసరమైతే రెఫర్ చేస్తున్నారు. ఈ స్క్రీనింగ్తో ముందుగానే సమస్యలను గుర్తించి, వాటికి వైద్యం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం సంతోషం.
– చిర్ర సంధ్యారాణి, అప్పారావుపేట