వేములవాడ టౌన్, జనవరి 28: వేములవాడ రాజన్న సన్నిధిలో ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో కృష్ణప్రసాద్ ఆదివారం వెల్లడించారు. ఇందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని, ఓపెన్స్లాబ్ను సుందరంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం 5.45 గంటలకు స్వస్తి పుణ్యాహవచనంతో ప్రారంభమై 7.25 గంటలకు నగర సంకీర్తన, 9 గంటలకు జ్యోతి ప్రజ్వలన ఉంటుందని వెల్లడించారు. ఐదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో సుప్రసిద్ధ కళాకారులతో శాస్త్రీయ, భక్తి, సంగీత, హరికథ, నృత్య, నాటక, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఉత్సవాల ఇన్చార్జి కొంటికర్ల రామయ్య శర్మ తెలిపారు.