కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 14 : వెనుకబడిన తరగతుల కుటుంబాలకు చెందిన మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు అందజేస్తున్న కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎం అనిల్ప్రకాశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సెప్టెంబర్ 13 వరకు దరఖాస్తుల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, అర్హులైన బీసీ మహిళలు గడువులోగా తమ దరఖాస్తులను http://tgobmms.cgg.gov.in/వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.