కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 3: ఆరు గ్యారంటీల అమలు కోసం అంతటా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ పరంగా సాగుతున్న ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వేదికలపై తమను కూర్చోనివ్వాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
ఇదే విషయమై బుధవారం కరీంనగర్లోని 5వ డివిజన్లో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అధికారిక కార్యక్రమంలో ఇతరులకు అవకాశం ఉండని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని అడ్డుకున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే ప్రజలకు సూచనలు చేయవచ్చుకానీ, కేంద్రంలోని స్టేజ్ వద్ద కూర్చోవడానికి వీలు లేదని చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. పక్కన ఉండి వచ్చే ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకొని అధికారులకు అందించారు.