కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 8 : నీట్ -2022 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు ప్రతిభ కనబర్చి వివిధ కేటగిరీల్లో ఉత్తమ మార్కులు సాధించినట్లు విద్యా సంస్థల చైర్మన్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కళాశాలకు చెందిన దోమల అనుష 650 మారులతో అగ్రస్థానంలో నిలువగా, ఎం రుషిధర్ 614, మహ్మద్ హజ్జా అసద్ 571, జీ అక్షర 563, ఆర్ నిఖిల 552, టీ శ్రీఅక్షిత 548, టీ శ్రీవాణి 545, దిల్షాదెమెహజాబిన్ 541, ఎన్ మెర్లినోజ్యోతి 537, కే వర్ష 536, ఎం జ్ఞానద 532, ఎస్ శివాత్మిక 529, సయ్యద్ అలీ యమిన్ 523, వీ రష్మిత 523, సీహెచ్ సాత్విక 520, మదీహావాసి 515, యుస్రాఫాతిమా 508, జీ సాత్విక 503, హెచ్ అపూర్వ 499, బీ సహస్ర 499, బీ వైష్ణవి 496, ఎం దీక్షితప్రియా 489, ఆర్ స్రవంతి 483 మారులు సాధించారని చెప్పారు. వీరితో పాటు సుమారు 50 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్లో సీటు సాధించే అకాశం ఉన్నదన్నారు. అలాగే, ఇంటర్ ఫలితాల్లో 468 మారులతో రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలవడంతోపాటు ఐఐటీ మెయిన్స్లో 400 మందికిపైగా విద్యార్థులు అద్భుత మారులతో ఐఐటీ (అడ్వాన్స్డ్)కు అర్హత సాధించారన్నారు.
ట్రినిటి విద్యార్థుల హవా
నీట్ ఫలితాల్లో ట్రినిటి కళాశాలలు, నీట్ అకాడమీ విద్యార్థులు సత్తాచాటారు. బీ శాంభవి 720 మారులకు 655 మారులు సాధించి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. అలాగే బీ సంవేద్య 564, బీ కౌశిక్ రావు 517, వీ బిందుజ 510, కే రాహుల్ 504, ఏ మధు 498, డీ నితిన్ 494, వై హర్షిణి 490 సాధించగా, విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇంటర్ మారులలోనే కాకుండా అన్ని విభాగాల్లో ట్రినిటి విద్యార్థులు ముందంజలో ఉన్నారని తెలిపారు.