తిమ్మాపూర్ రూరల్/ మానకొండూర్ రూరల్, జనవరి 24 : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే విపక్షాల నేతలు తమ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు.
సోమవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మేడి అంజయ్య, రామకృష్ణకాలనీ ఎంపీటీసీ కిన్నెర సుజాతతో పాటు సుమారు వంద మంది, మానకొండూర్ మండలం చెంజర్లలో బీజేపీ గ్రామాధ్యక్షుడు బుర అనిల్ గౌడ్ టీఆర్ఎస్లో చేరారు.
వారిని ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమైందన్నారు. పల్లెలు పచ్చగా మారాయని గుర్తు చేశారు. గతంలో మన్నెంపల్లి గ్రామం పరిస్థితిని వివరించారు.
తాగు, సాగు నీటికి గ్రామంలో తీవ్ర ఇబ్బందులు ఉండేవని.. తెలంగాణ వచ్చాకే తాను ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరించానని గుర్తు చేశారు.
కార్యక్రమంలో కరీంనగర్ ఏఎంసీ చైర్పర్సన్ ఎలుక అనిత, వైస్ చైర్మన్ గుజ్జుల రవీందర్రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ తిమ్మాపూర్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్తో పాటు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.