Vemulawada | వేములవాడ, జూన్ 27 : వేములవాడ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, అలాంటి విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ నియోజకవర్గ నాయకుడు పోతు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ పాఠశాల ఫీజులు పుస్తకాలు డ్రెస్సుల రూపంలో ఎక్కువ విద్యార్థి నుండి రూ.25 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తూ వ్యాపార కేంద్రాలుగా మార్చారని ఆరోపించారు.
నిబంధనల ప్రకారం పుస్తకాలు ఇతర వస్తువులు పాఠశాలలో విక్రయించరాదని ఉన్నప్పటికీ వాటిని బేఖాదర్ చేస్తున్నారని ఉన్నారు. మండల విద్యాధికారికి ఫిర్యాదు చేసేందుకు రెండు దఫాలుగా వెళ్లిన అధికారులు అందుబాటులో లేకపోవడంతో కార్యాలయానికి ఫిర్యాదు పత్రం పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకుడు లింగం రాకేష్ ఉన్నారు.