గన్నేరువరం, ఆగస్ట్5 : సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని ఏసీపీ విజయ్ కుమార్ ప్రజలకు సూచించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంకేంద్రంలో బుధవారం ఎస్ఐ నరేందర్ రెడ్డితో కలసి సైబర్ నేరాలపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాలు బాగా పెరిగాయని, ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.
వాట్సప్లో వచ్చే లింక్లు ఓపెన్ చేయొద్దని అన్నారు. ప్రజల బలహీనతలే సైబర్ నేరగాళ్లకు బలంగా మారిందన్నారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి వివరించారు. అదేవిధంగా శాంతి భద్రతలకు ఎవరైనా ఆటంక కలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో మంగళవారం నమోదు అయిన ఎస్సీ, ఎస్టీ కేసు పై విచారణ చేపట్టారు.