కొత్తపల్లి, ఫిబ్రవరి 25: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కరీంనగర్ ఏసీపీ ప్రతాప్ క్రీడాకారులకు సూచించారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి క్రీడలే ప్రధాన కారణమని గుర్తు చేసుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ గార్డెన్స్లో ఇంటర్నేషనల్ షావోలిన్ కుంగ్ ఫూ బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి తెలంగాణ తొలి కుంగ్ ఫూ, కరాటే పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు.
మార్షల్ ఆర్ట్స్ లాంటి యుద్ధ క్రీడను ప్రతి ఒకరూ నేర్చుకుంటే ఆత్మ స్థయిర్యం, విశ్వాసం పెరుగుతుందని వివరించారు. ఇటీవలి కాలంలో కరీంనగర్లో క్రీడాపోటీలను బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారని పేర్కొంటూ, నిర్వాహకులను అభినందించారు. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో మార్షల్ ఆర్ట్స్కు కంచుకోట కరీంనగర్ అని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఎందరో ఉన్నారన్నారు.
అనంతరం పలు విభాగాల్లో గెలుపొందిన క్రీడాకారులకు బంగారు, రజత, కాంస్య పతకాలను ఏసీపీ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ, తదితర అతిథులను నిర్వాహకులు ఘనంగా సతరించారు. పలువురు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, కరాటే విన్యాసాలు అలరించాయి. ఇక్కడ వాగ్దేవి కళాశాల చైర్మన్ గోవిందవరం కృష్ణ, పోటీల నిర్వాహకులు, ఇన్స్ట్రక్టర్ ఏ శ్రీనివాస్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్రెడ్డి, అత్యాపత్యా క్రీడా సంఘం అధ్యక్షులు చీటి రామారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే సంజీవ్రెడ్డి, ప్రొఫెసర్ మల్లారెడ్డి, ఫండస్ సూల్ డైరెక్టర్ శశాంక్రెడ్డి, కరాటే ఇన్స్ట్రక్టర్లు సురబి వేణుగోపాల్, బాబురావు, హరికృష్ణ, విద్యాసాగర్, శేఖర్, మూర్తి, మొయిన్, రవి వర్మ, అన్వర్ఖాన్, అఖిల, ఫైమిదా ఖాతూన్ ఉన్నారు.