హుజూరాబాద్ టౌన్, డిసెంబర్ 31: జాతీయ హాకీ క్రీడా పోటీలకు ఎంపికైన హుజూరాబాద్ పట్టణానికి చెందిన తాళ్లపల్లి మేఘన, మల్లెల నిఖితను శనివారం పలువురు ప్రముఖులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హుజూరాబాద్ ప్రాంతం క్రీడలకు ముఖ్యంగా హాకీకి పేరొందిందన్నారు. ఈ ప్రాంతం నుంచి అనేక మంది క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదిగారని, మరో ఇద్దరు బాలికలు సైతం ఆ స్థాయికి చేరడం సంతోష దాయకమన్నారు.
కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హాకీ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, సామాజిక కార్యకర్త వర్దినేని రవీందర్రావు, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, గనిశెట్టి ఉమామహేశ్వర్, హాకీ క్లబ్ ఉపాధ్యక్షుడు భూసారపు శంకర్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఇమ్రాన్, నాయకులు బత్తుల సమ్మయ్య, బత్తుల రాజలింగం, కొలిపాక సారయ్య, రవీందర్బాబు, డాక్టర్ శేఖర్, దామోదర్, కే సారయ్యగౌడ్, నల్ల సుమన్, ఎం వినయ్, కే అశోక్ తదితరులు పాల్గొన్నారు.