బోయినపల్లి, ఫిబ్రవరి 4: అమ్మపై ప్రేమతో సామాజిక సేవలో పరితపిస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థిని పొల్సాని అనన్య. చిన్న వయసులోనే తన తల్లి చదువుకున్న స్కూల్కు మొబైల్ లైబ్రరీ వాహనాన్ని అందించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి రవీందర్రావు-శశికళ మనుమరాలు పొల్సాని అనన్య, తన తల్లిదండ్రులు పొల్సాని సౌమ్య-శ్రీనివాసరావుపై ప్రేమతో సామాజిక సేవ చేస్తున్నది. ఈ క్రమంలో అనన్య తల్లి సౌమ్య అప్పట్లో కొదురుపాక జడ్పీస్కూల్లోనే విద్యనభ్యసించారు. పదో తరగతిలో మండల టాపర్గా నిలిచారు. ఈ క్రమంలో తన తల్లిపై ప్రేమతో అనన్య ఏడాది క్రితమే పాఠశాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. పిల్లల కోసం ఏదైనా చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో పాఠశాలకు మొబైల్ లైబ్రరీ వాహనాన్ని బహూ కరించగా, శనివారం జోగినపల్లి రవీందర్రావు, అనన్యతో కలిసి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా అనన్యతోపాటు ఆమె తల్లిదండ్రులను ఎమ్మెల్యే సన్మానించారు. కాగా, కొదురుపాక పాఠశాలలో కంప్యూటర్ గది అప్డేషన్ కోసం లక్ష ఆర్థిక సాయం ఇస్తున్నట్లు పొల్సాని సౌమ్య ప్రకటించారు. కార్యక్రమంలో జోగినపల్లి ప్రేమ్సాగర్రావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెరపాక ఉమ కొండయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, సెస్ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, నాయకులు అనుముల భాస్కర్, ఇన్చార్జి ఎంఈవో శ్రీనివాస్, హెచ్ఎం రంగానాథశర్మ, ఉప సర్పంచ్ రవిచందర్, సర్పంచులు బూర్గుల నందయ్య, కన్నం మధు, ఇల్లందుల శంకర్, చిందం రమేశ్, సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీ ఉపేందర్, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ అజ్జు పాల్గొన్నారు.
అభినందనీయం
అనన్య చిన్న వయసులో ఇంత మంచి ఆలోచన చేయడం అభినందనీయం. ఈ లైబ్రరీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రయోజకులు కావాలి. ప్రభుత్వం అందిస్తున్న డిజిటల్ విద్యకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో కథలతోపాటు విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు, ల్యాప్ ట్యాప్, స్పోర్ట్స్ సంబంధించిన ఆట వస్తువులు కూడా ఉన్నాయి.
– ఎమ్మెల్యే సుంకె రవిశంకర్