తిమ్మాపూర్ రూరల్, జనవరి 3: నియోజకవర్గంలోని మూడు మండలాల్లో మంగళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీఎల్ఎం (బోధనాభ్యసన సామగ్రి) ప్రదర్శన మేళా ఆకట్టుకున్నది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి బోధనాభ్యసన సామగ్రి ప్రదర్శన మేళాకు ఎంపీపీ కేతిరెడ్డి వనితాదేవేందర్రెడ్డి సందర్శించి, మాట్లాడారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను పెంపొందించడంలో బోధనాభ్యసన సామగ్రి పాత్ర కీలమైందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జక్కని శ్రీవాణీ, ఎంఈవో శ్రీనివాస్రెడ్డి, మండల నోడల్ అధికారులు దేవశంకర్, జయపాల్, లక్ష్మణ్రావుతో పాటు పలు పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
గన్నేరువరంలో..
గన్నేరువరం (తిమ్మాపూర్ రూరల్), జనవరి 3: గన్నేరువరం మండల స్థాయి బోధనాభ్యాస సామగ్రి ప్రదర్శన మేళాను జంగపల్లి హైస్కూల్లో నిర్వహించారు. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో సుమారు వందకు పైగా తయారు చేసిన బోధనాభ్యాసన సామగ్రిని ఉపాధ్యాయులు ప్రదర్శించారు. ఇలాంటి పరిజ్ఞానంతో విద్యను బోధించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని ఎంపీడీవో స్వాతి, ఎంఈవో శ్రీనివాస్రెడ్డి అన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారులు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించాలి
చిగురుమామిడి, జనవరి 3: విద్యార్థుల్లో విద్యతో పాటు సృజనాత్మకతను పెంపొందించాలని ఎంపీపీ కొత్త వినీతా శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రెండు రోజుల టీఎల్ఎం మేళాను సందర్శించారు. బోధనోపకరణాలను పరిశీలించి, మాట్లాడారు. అనంతరం పాఠశాల ఆవరణలో సావిత్రీబాయిఫూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, మండల నోడల్ ఆఫీసర్, హెచ్ఎం మునిగంటి శోభారాణి, క్లస్టర్ నోడల్ ఆఫీసర్ ఎడబోయిన రవీందర్ రెడ్డి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాపురావు, శ్రీనివాస్, కిషన్ నాయక్, మండల రిసోర్స్ పర్సనల్ మునిప్రసాద్, విజయభారతి, కరుణాకర్, అనిల్ ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, సీఆర్పీలు ఆంజనేయులు, శ్రీనివాస్, శ్రీవాణి, వెంకటేశం, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
బోధనోపకరణాలతో అభ్యసన సామర్థ్యాల పెంపు
శంకరపట్నం, జనవరి 3: బోధనోపకరణాలతో విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించవచ్చని మండల నోడల్ అధికారి వైద్యుల రాజిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కేశవపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో టీఎల్ఎం (ఐఎల్ఎం) మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థుల్లో అభ్యసన స్థాయిలను మెరుగుపరచడానికి రెండు రోజుల పాటు టీఎల్ఎం మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ టీఎల్ఎం ఆధారంగానే ప్రతి ఉపాధ్యాయుడు తన పీరియడ్లో పాఠ్యాంశాలు బోధించాలని తెలిపారు. ఉపాధ్యాయులు తాము తయారు చేసి తీసుకువచ్చిన కృత్యాలను మేళాలో ప్రదర్శించారు. సెక్టోరియల్ అధికారి (క్వాలిటీ కో ఆర్డినేటర్) కర్ర అశోక్రెడ్డి, తహసీల్దార్ గూడూరి శ్రీనివాస్రావు మేళాను పర్యవేక్షించారు. ఎస్ఆర్పీ శ్రీలత, డీఆర్పీ కొండల్రెడ్డి, క్లస్టర్ నోడల్ అధికారులు మమతా గౌతమి, రోజా రమణి, ఆనందం, ఎంఆర్పీలు భూపతి, శ్రీనివాస్, కోటేశ్వర్, కేశవపట్నం ఉప సర్పంచ్ హనుమంతు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.