జగిత్యాల నమస్తే తెలంగాణ, డిసెంబర్ 2: జిల్లాలో గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల్లో 76.65 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఉన్న 785 పోలింగ్ బూత్లో 5,35,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, జిల్లా వ్యాప్తంగా సగటున 76.65 శాతం పోలింగ్ నమోదైంది. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గాల పరిధిలో 785 పోలింగ్ బూతులు ఉండగా, 6,99,203 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల ఓటర్ల సంఖ్య కంటే అధికంగా ఉండగా, పోలింగ్ విషయంలోనూ వారు తమ అధిపత్యాన్ని ప్రదర్శించారు.
3,37,919 మంది పు రుష ఓటర్లు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఉండ గా, కేవలం 2,42,840 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులకు సంబంధించి కేవలం 71.86 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అదే మహిళా ఓటర్ల విషయంలో పురుషుల ఓటింగ్కు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో మహిళా ఓటర్లు 3,61,254 మంది ఉండగా, 2,93,140 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు తరలిరావడంతో 81.14 శాతం పోలింగ్ నమోదైంది.
జగిత్యాల నియోజకవర్గంలో 2,31,468 మంది ఓట ర్లు ఉన్నారు. అందులో 1,11,720 మంది పురుషులు, 1,19,728 మంది మహిళా ఓటర్లు, 20 మంది థర్డ్ జండ ర్ ఓటర్లున్నారు. 254 బూత్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో 78,920 మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకోగా, 95,651 మంది మహిళా ఓటర్లు త మ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక 13 మం ది థర్డ్ జండర్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా నియోజకవర్గంలో 1,74,584 ఓట్లు పోల్ అయ్యాయి. పురుషులకు సంబంధించి 70.64 శాతం, మహిళలకు 79.89 శాతం పోలింగ్ నమోదైంది.
ధర్మపురి నియోజకవర్గంలో 79.01 శాతం పోలింగ్ న మోదైంది. నియోజకవర్గంలో 1,11,172 మంది పురుష ఓట్లు, 1,15,702 మంది మహిళా ఓటర్లు, ఆరుగురు థర్డ్ జండర్ ఓటర్లతో కలిపి మొత్తం 2,26,880 మంది ఓటర్లు ఉన్నారు. 269 బూత్ల పరిధిలో జరిగిన పోలింగ్లో 83,567 మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 95,704 మంది మహిళలు తమ ఓటు హ క్కును వినియోగించుకున్నారు. పురుషులకు సంబంధించి 75.16 శాతం పోలింగ్ నమోదు కాగా, మహిళలకు సంబంధించి 82.71 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం గా నియోజకవర్గంలో 1,79, 271 మంది ఓటర్లు ఓటు వేయడంతో 79.01 శాతం పోలింగ్ నమోదైంది.
కోరుట్ల నియోజకవర్గంలో 75.62 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో 1,15,027 మంది పురు ష ఓటర్లు ఉండగా, 1,25,824 మంది మహిళా ఓటర్లు, నలుగురు థర్డ్ జండర్ ఓటర్లు ఉన్నారు. 262 పోలింగ్ బూత్ల పరిధిలో పోలింగ్ జరిగింది. 80,353 మంది పు రుషులు ఓటు వేయగా, 1,01,785 మంది మహిళలు, ఇద్దరు థర్డ్ జండర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల్లో 69.85 శాతం పోలింగ్ నమో దు కాగా, మహిళల్లో 80.89 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా నియోజకవర్గంలో 1,82,140 మంది ఓటర్లు ఓటు వేయడంతో 75.62 శాతం పోలింగ్ నమోదైంది.