రాంనగర్, డిసెంబర్ 23: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు 14వ రోజు కొనసాగాయి. శుక్రవారం 1204 మంది హాజరుకావాల్సి ఉండగా 928మంది హాజరయ్యారు. 540మంది అర్హత సాధించారు. 387మంది డిస్క్వాలిఫై అయ్యా రు. 154 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. 123 మంది అనారోగ్యం, ఇతర కారణాలను చూపుతూ ధ్రువీకరణపత్రాలు సమర్పించగా పరిశీలించి ఇతర తేదీల్లో హాజరుకు అనుమతించారు. తొలుత అభ్యర్థుల ధ్రువీకరణ పత్రా ల పరిశీలన, బయోమెట్రిక్, రిజిస్ట్రేషన్, రిస్ట్ బ్యాండ్ టాగింగ్, ఆర్ఎఎఫ్ఐడీ బిబ్ జాకెట్లను ధరింపజేశారు.
1600 మీటర్ల పరుగులో అ ర్హ త సాధించిన వారికి ఫిజికల్ టెస్ట్లతో పాటు లాంగ్ జంప్, షాట్ పుట్ విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు. ఏ డీసీపీ జీ చంద్రమోహన్, ఏసీపీలు కే శ్రీనివాస్, వెంకటరెడ్డి, విజయ్ కుమార్, సీహెచ్ మల్లికార్జున్, ప్రతాప్, ఎస్బీఐ వెంకటేశ్వర్లు, ఏవో మునిరత్నం, సూపరింటెండెంట్ ఏవీఎన్ చారి, ఇన్స్పెక్టర్లు మాధవి, రవీందర్, బీ సంతోష్ కుమార్, రాజ్ కుమార్, ఆర్ఐలు జానిమియా, కిరణ్ కుమార్, ముర ళి, రమేశ్, మల్లేశం, సురేశ్ పాల్గొన్నారు.