రాంనగర్, డిసెంబర్ 16: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు 8వ రోజు కొనసాగాయి. సీపీ సత్యనారాయణ పర్యవేక్షణలో కొనసాగుతున్న పరీక్షలకు శుక్రవారం 1288 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 962 మంది హాజరయ్యారు. 539 మంది అర్హత సాధించగా 423 మంది డిస్ క్వాలిఫై అయ్యారు. 150 మంది అభ్యర్థు లు గైర్హాజరు కాగా, 176 మంది అనారోగ్య, ఇతర కారణాలను చూపుతూ ధ్రువీకరణపత్రా లు సమర్పించారు.
సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం సదరు అభ్యర్థులకు నిర్ణీత తేదీల్లో హాజరయ్యేందుకు అనుమతించారు. తొలుత అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, బయోమెట్రిక్, రిజిస్ట్రేషన్, రిస్ట్ బ్యాండ్ టాగింగ్, ఆర్ఏఎఫ్ఐడీ బిబ్ జాకెట్లను ధరింపజేశారు. 1600 మీ టర్ల పరుగులో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలతో పాటు లాంగ్ జంప్, షాట్ పుట్ విభాగాల్లో టెస్ట్లు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీపీ ఎస్ శ్రీనివాస్, ఏసీపీలు శ్రీనివాస్, వెంకటరెడ్డి, విజయ్కుమార్, సీహెచ్ మల్లికార్జున్, ప్రతాప్, ఎస్బీఐ వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారి మునిరత్నం, సూపరింటెండెంట్ ఏవీఎన్చారి, మినిస్టీరియల్ విభా గం అధికారులు, సిబ్బంది, ఇన్స్పెక్టర్లు మాధ వి, రవీందర్, బీ సంతోష్కుమార్, విజ్ఞాన్రా వు, కరుణాకర్, ఆర్ఐలు జానిమియా, కిరణ్ కుమార్, మురళి, రమేశ్, మల్లేశం ఉన్నారు.