భానుడు మండుతున్నాడు. ఉదయం తొమ్మిది దాటితేనే భగ్గుమంటున్నాడు.. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి.
తాజాగా శుక్రవారం అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 41 డిగ్రీలు రికార్డయ్యాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మధ్యాహ్నం ఇండ్ల నుంచి బయటికి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. ఫ్యాన్లు, కూలర్లు నడిచినా ఉక్కబోతతో సతమతమయ్యారు.
– కరీంనగర్, ఫొటోగ్రాఫర్