కమాన్ చౌరస్తా, ఆగస్టు 3: డిగ్రీ కాలేజీల్లో దోస్త్ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. అయి తే విద్యార్థులు డ్రాప్అవుట్స్ కాకుండా ఉద్దేశంతో ప్రభుత్వం మరో ప్రత్యేక అవకాశం కల్పించింది. కొందరు విద్యార్థులు ఐఐటీ, నీట్, ఇంజినీరింగ్ ప్రవేశాలపేరుతో జాప్యం చేశారు. వీరు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రత్యేక దశ పేరుతో మరో అవకాశం ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, ప్రభుత్వ కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ వాకటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారని పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనర్సయ్య కోరారు.
ఇప్పటికే దోస్త్ ప్రక్రియ ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులు ఏదేని గ్రూపు నుంచి మరో గ్రూపులోకి మారేందుకు ఇంట్రా కాలేజ్ కార్యక్రమం పేరిట అవకాశం కల్పించారు. ఈనెల 2 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే వాటిని పరిశీలించి ఈ నెల 5 న విద్యార్థులకు అవసరమున్న గ్రూపులోకి మార్చి సీట్లను కేటాయిస్తారు.
ఇంటర్పూర్తి చేసి ఐఐటీ, నీట్, ఎంసెట్లో ప్రవేశం కోసం వేచి ఉండి వివిధ కారణాలచే అవకాశాలను కోల్పోయిన వారు తిరిగి డిగ్రీ చదివే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అందుకోసం దోస్త్లో ప్రత్యేక దశను ప్రవేశపెట్టింది. డిగ్రీలో ప్రవేశం కోరే విద్యార్థులు 400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఈనెల 7 నుంచి 13 వరకు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈనెల 7 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఈ నెల 14న ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఇప్పటి వరకు దోస్త్ ప్రక్రియలో పాల్గొనని ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ప్రత్యేక దశలో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇప్పటికే దోస్త్ ప్రక్రియలో పాల్గొని సీటు పొందని వారుకూడా ప్రత్యేక దశలో పాల్గొని అడ్మిషన్లు పొందవచ్చు. దోస్త్ ద్వారా ప్రవేశం పొందాలనుకునే వారు ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. పూర్తి స్థాయి విచారణ అనంతరం ఈనెల 17న అర్హులైన విద్యార్థులందరికి సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు ఆయా కళాశాలల్లో ఈనెల 17 నుంచి 21 వరకు సెల్ఫ్రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు వివిధ కారణాలచే ఇంకా డిగ్రీలో అడ్మిషన్లు తీసుకోలేదు. వీరి కోసం ప్రభుత్వం ప్రత్యేక దశను తీసుకొచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇంకా ప్రవేశా లు పొందని వారు దోస్త్ ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేష న్ చేసుకుని డిగ్రీలో ప్రవే శం పొందవచ్చు. దోస్త్లో మొదటి విడుత, రెండో విడుతలో సీటు వచ్చి అడ్మిషన్ తీసుకోని విద్యార్థులు, ఇతరత్రా కారణాలచే ఇప్పటి వరకు దోస్త్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ చేసుకోనివారికి కూడా అవకాశం ఉంటుంది.
-డాక్టర్ లక్ష్మీనర్సయ్య, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీకళాశాల (పెద్దపల్లి)