పెద్దపల్లి/ పెద్దపల్లి రూరల్/ మంథని, డిసెంబర్ 11 : భారత రాష్ట్ర సమితిలో చేరికల జోష్ కనిపిస్తున్నది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి సబ్బండ జనం బీఆర్ఎస్కు జైకొడుతున్నది.
పెద్దపల్లి, మంథనికి చెందిన సుమారు 350 మంది ముస్లిం యువకులు, మహిళలు ఆదివారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.