ఎమ్మెల్యే సంజయ్ కుమార్
రాయికల్ మున్సిపల్ అభివృద్ధిపై కరపత్రం ఆవిష్కరణ
రాయికల్ రూరల్, జనవరి 30: ఓట్లు వేసి అధికారం కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని, నిరంతరం ప్రజల సంక్షేమం మరవకుండా సేవాభావం కలిగి ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రాయికల్ మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు సూచించారు. రాయికల్ మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ ముద్రించిన కరపత్రాన్ని ఎమ్మెల్యే ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సేవాగుణం ఉంటేనే సమాజంలో గుర్తింపు వస్తుందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కొత్తగా ఏర్పడిన రాయికల్ మున్సిపల్ను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలని, అందుకు సమన్వయంతో పాలకవర్గం అహర్నిశలు కృషి చేయాలని అన్నారు. అభివృద్ధికి తన సహకారం ఉం టుందన్నారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్గౌడ్, చైర్మన్ మోర హన్మాండ్లు, కౌన్సిలర్లు మ్యాకల కాంతారావు, తురగ శ్రీధర్ రెడ్డి, కనపాక మహేందర్, పిప్పోజి మహేందర్ బాబు, మోబిన్, సోహెల్, నాయకులు అచ్చుత్రావు, ఎలిగేటి అనిల్, మోర రామ్మూర్తి, పెండె ల గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే, జడ్పీ అధ్యక్షురాలు పరామర్శ
జగిత్యాల పట్టణానికి చెందిన చిట్ల సుధీర్ అనారోగ్యంతో మృతిచెందగా అతడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే పట్టణానికి చెందిన మామిడి వరప్రసాద్, రిటైర్డ్ టీచర్ శీలం పృథ్వీధర్, ఊటూరి మల్లేశం, నోముల పోశెట్టి వివిధ కారణాలతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. యూసఫ్ ఇక్బాల్ కొడుకు ఇర్ఫాన్ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారివెంట టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు బొడ్ల జగదీశ్, పంబాల రామ్కుమార్, ఏఎంసీ డైరెక్టర్ బట్టు ప్రవీణ్, ఎఫ్సీఎస్ డైరెక్టర్ ఆరుముళ్ల పవన్, నాయకులు బోగ ప్రవీణ్, అడువాల లక్ష్మణ్, ఇత్తేమద్ ఫారుఖ్, అలీ జాఫర్, మక్బుల్, ఇక్బాల్తోపాటు తదితరులున్నారు.