చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
జిల్లా వ్యాప్తంగా దీక్షా దివస్
చొప్పదండి, నవంబర్ 29: కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో 2009 నవంబర్ 29న చేపట్టిన కేసీఆర్ దీక్షా దివస్తోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. బెంగళూర్లో ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపులో భాగంగా సోమవారం ఆయన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి దీక్షా దివస్ నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి, ఆమరణ దీక్ష చేపట్టిన మహానుభావుడు అని కొనియాడారు. తెలంగాణ సమాజాన్ని ఏక తాటిపైకి తీసుకువచ్చి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. స్వరాష్ట్రంలో బంగారు తెలంగాణ ఏర్పాటుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి-సాంబయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు కొత్తూరి మహేశ్, కొత్తూరి స్వతంత్రభారతి-నరేశ్, దండె జమున-కృష్ణ, మాడూరి శ్రీనివాస్, వడ్లూరి గంగరాజు, నాయకుడు నలుమాచు రామకృష్ణ, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం
కార్పొరేషన్, నవంబర్ 29: దీక్షా దివస్ను పురస్కరించుకొని సోమవారం స్థానిక తెలంగాణచౌక్లో టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ పొన్నం అనిల్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నారని కొనియాడారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ను విమర్శించే అర్హత ప్రతిపక్ష నాయకులకు లేదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మల్లెంకి శ్రీనివాస్, చుక్కా శ్రీనివాస్, ఆరె రవిగౌడ్, శ్రావణ్రెడ్డి, అజిత్రావు, అజయ్, మోహన్, పరశురాంగౌడ్, వినోద్, జక్కుల అఖిల్గౌడ్, ప్రశాంత్, శ్రీధర్, శేఖర్, నయీం, ఓంకార్, సతీశ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్వై ఆధ్వర్యంలో..
హుజూరాబాద్టౌన్, నవంబర్ 29: పట్టణంలో టీఆర్ఎస్వై జిల్లా ప్రధాన కార్యదర్శి, మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మహ్మద్ ఖాలీద్హుస్సేన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కేసీఆర్ సేవాదళం నియోజకవర్గ అధ్యక్షుడు తొగరు శివకృష్ణ, పట్టణాధ్యక్షుడు చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకులు ఖాజా మొయినుద్దీన్బాబా, అంగిడి సాయి, చింతల ఓంరాజ్, సత్యం, అమ్జద్, సద్దాం, ఎజాస్, సయీద్ తదితరులు పాల్గొన్నారు.