ప్రభుత్వం 30శాతం జీతాలు పెంచుతూ జీవో జారీ చేయడంపై సర్వత్రా హర్షం
ధర్మపురి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, ఈశ్వర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు
ధర్మపురి, నవంబర్ 29: ధర్మపురి పట్టణంలోని నందిచౌక్ వద్ద సోమవారం సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఈశ్వర్ చిత్రపటాలకు ఆశ వర్కర్లు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల ఆశ వర్కర్లు ఉన్నారు.
పెగడపల్లి, నవంబర్ 29: మండలంకేంద్రంలో ఆశ వర్కర్లు, ఐకేపీ, సెర్ప్, కేజీబీవీ ఉద్యోగులు సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి, ఏఎంసీ చైర్మన్ తిరుపతినాయక్, సర్పంచ్ మేరుగు శ్రీనివాస్, నాయకులు రాజు, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, రమేశ్ పాల్గొన్నారు.
గొల్లపల్లి, నవంబర్ 29: మండల కేంద్రంలో ఆశ వర్కర్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేత చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆశ వర్కర్ల అధ్యక్షురాలు చెవులమద్ది సుగుణ, ఆశ వర్కర్లు అంజలి, సరిత, సుజాత, జల, వకుళ, స్వప్న, సుమలత, మంగ, జయ, మంజుల, లత, లక్ష్మి, అరుణ, లావణ్య, గీతారాణి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొల్లం రమేశ్, ఏఎంసీ చైర్మన్ ముస్కు లింగారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ బోయపోతు గంగాధర్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ మారంపెల్లి బాబు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పడాల జలంధర్, భోజనపు శ్రీనివాస్, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు మ్యాదరి రమేశ్, సర్పంచులు రమేశ్, సత్తయ్య, రవీందర్, శ్యాం, సత్తయ్య, గొల్లపల్లి ఉప సర్పంచ్ రాజశేఖర్, టీఆర్ఎస్వీ మండల ప్రధాన కార్యదర్శి పల్లెర్ల వినయ్ గౌడ్, చాడ వెంకటరమణ, రవీందర్, రాజారత్నం, కోదాడ శ్రీనివాస్, లచ్చయ్య, రాజేశ్, అంజి, రాజశేఖర్, సతీశ్, గోపాల్ రావు, రాజు, లింగారెడ్డి పాల్గొన్నారు.