ఉద్యమకారులు, విద్యార్థి నాయకులకు అవకాశాలు
రవీందర్సింగ్ది అవకాశవాద రాజకీయం
డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి
ముకరంపుర, నవంబర్ 29: టీఆర్ఎస్లో పదవులు అనుభవించిన వ్యక్తి తనకు న్యాయం జరుగలేదంటూ బయటకు పోయి పార్టీని విమర్శిస్తే ఎవరూ సహించరని డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. డీసీఎంఎస్ కార్యాలయంలో సోమవారం వైస్చైర్మన్ ఫకృద్దీన్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ మేయర్ రవీందర్సింగ్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదట రవీందర్సింగ్కే లబ్ధి జరిగిందన్నారు. పదవి లేకపోవడంతో తనకు అన్యాయం జరిగిందంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రూపాయి ఖర్చు లేకుండా రవీందర్సింగ్, తుల ఉమకు సీఎం కేసీఆర్ పదవులు కట్టబెట్టి గొప్ప అవకాశాలు అందించినా వీరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తి కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇలాంటి వారితోనే పార్టీకి నష్టమన్నారు. ఇంకొకరికి మౌత్ పీస్గా పని చేస్తున్న వీరిని భవిష్యత్లో ఎవరూ నమ్మరన్నారు. ఏ పార్టీ ఇవ్వని విధంగా అనేక మంది ఉద్యమకారులు, విద్యార్థి నాయకులకు పలు సమీకరణాల ప్రకారం కేసీఆర్ అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్కు ప్రజాబలం ఉందని, 90శాతం ప్రజాప్రతినిధులున్న పార్టీ అని పేర్కొన్నారు.