గోదావరిఖని, నవంబర్ 29 : సింగరేణి బొగ్గు గనుల్లో ప్రమాదాల నివారణకు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్, ప్రాజెక్ట్ అండ్ ప్లా నింగ్) ఎన్ బలరాం పిలుపునిచ్చారు. గోదావరిఖని ఇల్లెందు క్లబ్లో సోమవారం సింగరేణి స్థాయి రక్షణ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలతో పాటు జాతీయ కార్మిక సం ఘాలతో సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకోవాలని భావించినట్లు ఆయన పేర్కొన్నారు. కోలిండియాకు సిం గరేణి జియాలజికల్ పరిస్థితుల్లో తేడా ఉందని, కోలిండియాలో గ్రేడియంట్ ఫ్లాట్గా ఉంటే సింగరేణిలో స్టెప్ గ్రేడియంట్ ఉండ డంతో ప్రమాదాలకు కారణమవుతున్నదని తెలిపారు. 95 శాతం బొగ్గు ఓసీపీల ద్వారా, కేవలం 5శాతం బొగ్గు అండర్గ్రౌండ్ గనుల ద్వారా వస్తున్నదని వెల్లడించారు. సింగరేణిలో ఓసీపీల ద్వారా 86 శాతం, అండర్గ్రౌండ్ గనుల ద్వారా 14 శాతం వస్తున్నదని చెప్పారు. ప్రమాదాలు ఎక్కువగా అండర్గ్రౌండ్ గనుల్లోనే జరుగుతున్నాయన్నారు. నివారణ కోసం కార్మికులకు అవగాహన కల్పించేలా పని చేయాల్సి ఉందని, కార్మిక సంఘాల నాయకులు సహకరించాలని కోరారు. టీబీజీకేఎస్తో పాటు జాతీయ కార్మిక సంఘాల నాయకులు నివారణా చర్యలపై రోజంతా చర్చించి, పలు సూచనలు చేశారు. సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ (ఈఅండ్ఎం) డీ సత్యనారాయణరావు, కార్పొరేట్ జీఎంలు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, కొత్త సత్యనారాయణరెడ్డి, దేవ వెంకటేశం, ఏనుగు రవీందర్రెడ్డి, వీర భద్రయ్య, కాపు కృష్ణ, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్, నర్సింహారెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, సీఐటీయూ అధ్యక్షుడు టీ రాజారెడ్డి పాల్గొన్నారు.