గోదావరిఖని, నవంబర్ 29 : సింగరేణి మై నింగ్ సిబ్బంది ప్రధాన సమస్యలను కూడా స మ్మె డిమాండ్ నోటీసులో చేర్చాలని మైనింగ్ సి బ్బంది కోరారు. ఈ మేరకు గోదావరిఖనిలో సో మవారం టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘా ల నాయకులను కలిసి వినతి పత్రం అందజేశా రు. ఏ కారణం చేతనైనా విధులకు అన్ఫిట్ అ యిన మైనింగ్ సిబ్బందిని సర్ఫేస్లో అదే హో దాలో ఉద్యోగం ఇవ్వాలని, మైనింగ్, నాన్ మైనింగ్ సిబ్బందికి మెరుగైన ప్రమోషన్ పాలసీని కల్పించాలని, కోలిండియా మాదిరిగా చార్జి అలవెన్సు చెల్లించాలని, గని ప్రమాదాలకు మైనింగ్ సిబ్బందిని మాత్రమే బాధ్యులను చేయ డం మానుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, ఏఐటీయూసీ నాయకులు సీతారామయ్య, ప్రకాశ్, ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్, నర్సింహారెడ్డి, ఇతర కార్మిక సంఘాల నాయకులు హామీ ఇచ్చారు. బెల్లంపల్లి, రామగుండం రీజియన్ మైనింగ్స్టాఫ్ నాయకులు మాదాసి రామ్మూర్తి, వంగరి రాజేశ్వరరావు, నాగెల్లి సాంబయ్య, సత్యనారాయణ, బాణేశ్, అనిల్కుమార్, రమేశ్, శ్రీకాంత్, కార్తిక్, మహేందర్ తదితరులు ఉన్నారు.