స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్
పెద్దపల్లి డివిజన్ స్థాయి చాంపియన్ ధర్మారం -1 జట్టు
పెద్దపల్లిటౌన్, నవంబర్ 28: క్రీడాకారులు ఆటల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ ఆకాంక్షించారు. పెద్దపల్లి జూనియర్ కళాశాల మైదానంలో వాలీబాల్ టోర్నీలో భాగంగా ఏడు మండలాల జట్లు తలపడ్డాయి. వీటిలో సెమీఫైనల్లో జూలపల్లి-ధర్మారం-2 జట్లు పోటీపడగా, జూలపల్లి విజయం సాధించింది. సుల్తానాబాద్-ధర్మారం-1 జట్లు తలపడగా, ధర్మారం-1 గెలుపొందింది. ఫైనల్లో జూలపల్లి-ధర్మారం1 జట్లు పోటీపడగా, ధర్మారం-1 జట్టు గెలుపొందగా, జూలపల్లి జట్టు సెకండ్ స్థానంలో నిలిచింది. ఫైనల్ విజేతలకు బహుమతులు అందజేసే కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. పెద్దపల్లి పోలీసులు డివిజన్ స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. యువత గుట్కాలు, సిగరెట్లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం పొందాలని సూచించారు. అనంతరం క్రీడాకారులతో గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహరించాలని ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజేత జట్లకు బహుమతులు పంపిణీ చేశారు. క్రీడలకు రెఫరీలుగా వ్యవహరించిన పీడీ, పీఈటీలను శాలువాలతో సన్మానించారు. టోర్నీ విజయవంతం కావడంతో పోలీసులు, క్రీడాకారులు సంబురాలు చేసుకున్నారు. ఇక్కడ పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్కుమార్, ఇంద్రసేనారెడ్డి, బర్ల అనిల్, ఎస్ఐలు రాజేశ్, ఉపేందర్రావు, లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మహేందర్, షేక్జానీ పాషా, పీఎస్ఐలు రాజువర్ధన్, స్వప్న, సీనియర్ క్రీడాకారుడు తోట శంకర్, పీడీలు రాజయ్య,శ్రీధర్, పీఈటీలు డాక్టర్ వేల్పుల సురేందర్, శ్రీనివాస్, రమాదేవి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.