చొప్పదండి, నవంబర్ 28: జిల్లా వ్యాప్తంగా ఆదివారం మహాత్మా జ్యోతిబాఫూలే వర్ధంతి నిర్వహించారు. చొప్పదండిలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెద్దెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు జ్యోతిబాఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత సముద్రాల అంజయ్య మాట్లాడుతూ, దేశంలో విద్యావ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఎంతో కృషి చేసిన మహనీయుడు ఫూలే అని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తోడేటి రత్నం, నాయకులు కల్లెపల్లి రత్నం, పురుషోత్తం, ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు సదానందం, స్వేరో పట్టణాధ్యక్షుడు శ్రావణ్, నాయకులు తాండ్ర రాజేందర్, చెట్టిపల్లి శ్రీనివాస్, కొత్తూరి శ్రీనివాస్, ప్రశాంత్, అరవింద్, రామ్కుమార్, విక్రమ్, అనిల్, నరేశ్, రావణ్, హరీశ్, మహేశ్, భూపతి తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, నవంబర్ 28: మండలంలోని మధురానగర్ చౌరస్తాలో జ్యోతిబాఫూలే చిత్రపటానికి బీఎస్పీ మండల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల రాజేందర్, అంబేద్కర్ సంఘం మండలాధ్యక్షుడు కొలెపాక స్వామి, నాయకులు ఆరెపెల్లి వినోద్, శనిగరపు నరేశ్, మహేందర్, గజ్జెల సతీశ్, కోరెపు రామస్వామి, నవీన్, సముద్రాల అంజయ్య, తీగల శ్రీనివాస్, ద్యావ హన్మాంతు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, నవంబర్ 28: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్పవ్యక్తి జ్యోతిబాఫూలే అని ప్రజాసంఘాల, విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. నగరంలోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో ఫూలే చిత్రపటానికి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్, జిల్లా అధ్యక్షుడు కనకయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు జహంగీర్, సతీశ్, అరుణ్ పాల్గొన్నారు. అలాగే, నగరంలోని ఫూలే విగ్రహానికి దిశ సభ్యుడు జానపట్ల స్వామి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు జీఎస్ ఆనంద్, బాల్రెడ్డి, లక్ష్మీనారాయణ, రాగి సత్యనారాయణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో…
నగరంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఫూలే చిత్రపటానికి సంఘం జిల్లా అధ్యక్షుడు శనిగరపు రజినీకాంత్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో అణగారిన వర్గాలకు విద్యనందించడానికి జ్యోతిబాఫూలే, సావిత్రీ బాయి ఫూలే చేసిన పోరాటాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, పూజ, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో..
కమాన్చౌరస్తా, నవంబర్ 28: రాంచంద్రాపూర్ కాలనీలోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జ్యోతిబాఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి బాలసంకుల అనంతరావు, జిల్లా పీఆర్వో గాలిపెల్లి, యూత్ విభాగం జిల్లా కన్వీనర్ ఉయ్యాల విష్ణువర్ధన్, నియోజకవర్గ కన్వీనర్ అనువోజు రవికాంత్, రాజు పాల్గొన్నారు.