జ్యోతినగర్, సెప్టెంబర్ 27: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తూ సోమవారం చేపట్టిన భారత్బంద్ రామగుండం, ఎన్టీపీసీ పట్టణాల్లో ప్రశాం తంగా విజయవంతమైంది. బంద్కు మద్దతుగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సీపీఎం, సీపీఐ నాయకులు రామగుండం మసీద్ టర్నింగ్, రైల్వే స్టేషన్ ఏరియా, ఎన్టీపీసీలోని మేడిపల్లి సెంటర్, మేడిపల్లి రోడ్, ఎఫ్సీఐ క్రాస్రోడ్లోని దుకాణాలను బంద్ చేయించారు. ఇక్కడ నాయకులు నాంసాని శంకర్, చిలుక శంకర్, వెంగళబాపు, రామాచారి, మహేందర్, ఎం శంకర్, ఆర్ లక్ష్మణ్, కే మల్లేశ్ తదితరులు ఉన్నారు.
ఓదెల, సెప్టెంబర్ 27: ఓదెల, పొత్కపల్లి, కనగర్తి గ్రామాల్లో దుకాణాలు, బడులను బంద్ చేయించారు. ఆర్టీసీ బస్సుల ఎదుట నిరసన తెలిపారు.
వామపక్ష పార్టీల ర్యాలీ
గోదావరిఖని, సెప్టెంబర్ 27: గోదావరిఖనిలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. ప్రధాన కూడళ్ల వెంట ర్యాలీ కొనసాగిస్తూ వ్యాపార సంస్థలను బంద్ చేయించారు. అనంతరం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు కనకరాజ్, మద్దెల దినేశ్, గౌతం గోవర్ధన్, ఎల్లా గౌడ్, ఇ నరేశ్, తోకల రమేశ్, దుర్గయ్య, వేల్పుల కుమారస్వామి, రమేశ్కుమార్, రాజిరెడ్డి, వెంకన్న, చంద్రయ్య, రాజేందర్, మహేందర్, శ్రీధర్, అన్వేశ్, ఏడుకొండలు, జిమ్మి బాబు, మెండ శ్రీను, మహేశ్వరి, మహేందర్, బైరం శంకర్, రాజలింగు, శనిగరపు చంద్రశేఖర్, సల్ల రవీందర్, రాంచంద్ర, ప్రీతమ్, విజయ్ ఉన్నారు.
యైటింక్లయిన్ కాలనీ, సెప్టెంబర్ 27: పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా రెండు గంటల పాటు మూసివేసి సంఘీభావం ప్రకటించాయి. టూటౌన్ సీఐ శ్రీనివాస్రావు సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ, కార్మిక సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
పెద్దపల్లిటౌన్, సెప్టెంబర్ 27: బంద్లో భాగంగా నాయకులు పెద్దపల్లిలోని వీధుల గుండా బైక్ ర్యాలీ తీశారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, నాయకులు పెర్క శ్యాం,కడారి శ్రీనివాస్, వేముల రాజు, ఎండీ సర్వర్ బొడుపల్లి శ్రీనివాస్, నల్గొండ కుమార్, సదానందం, లెనిన్, ప్రేమ్కుమార్, ముత్యంరావు, సంతోష్, సీపెల్లి రవీందర్, కల్లెపల్లి అశోక్, మోదుంపల్లి శ్రావణ్, సీపెల్లి దిలీప్, జిల్లెల ప్రశాంత్, జీ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్,సెప్టెంబర్27: కాల్వశ్రీరాంపూర్లో నాయకులు దుకాణాలతో పాటు, బ్యాంక్, పెట్రోల్ బంక్లు బంద్ చేయించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొక్కీస రవీందర్గౌడ్, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ మాదాసి సతీశ్, పొట్టాల మొండయ్య, మంద రాజేందర్, మునీర్, మేడి అశోక్, అల్లంల దేవేందర్, బంగారి రమేశ్, ద్యాగేటి రాంచంద్రం, కాల్వ వేమారెడ్డి, సురేశ్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.