మేయర్ వై సునీల్రావు
నగరంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
కార్పొరేషన్, నవంబర్ 26: భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని మేయర్ వై సునీల్రావు కొనియాడారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, దేశాన్ని ఒకే తాటిపై నడిపించేందుకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. దళిత సంఘం నాయకుడు మేడి మహేశ్, బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కమాన్చౌరస్తా, నవంబర్ 26: శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ శ్రీవాణి మాట్లాడుతూ, రాజ్యాంగంలోని హక్కులు, చట్టాల గురించి వివరించారు. ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ కే పద్మావతి, డాక్టర్ చక్రధరస్వామి, డాక్టర్ మునావర్, డాక్టర్ విజయ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా విద్యాధికారి కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని డీఈవో సీహెచ్ వీఎస్ జనార్దన్ రావు, ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. అలాగే, శ్రీ చైతన్య పీజీ కళాశాలలో విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి అధ్యాపకులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ సదాశివ శర్మ, విద్యాసంస్థల డైరెక్టర్ కే నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాణినికేతన్ డిగ్రీ, పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ ఐ దీపిక, ప్రిన్సిపాల్ డీ వేణుగోపాల్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి పెద్ది రమేశ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ కే రవీందర్రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఎన్ఎస్ఎస్ అధికారి పూజ, అధ్యాపకులు ఎండీ రఖీబ్, సతీశ్ రెడ్డి, రామ్మోహన్, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్సారార్ డిగ్రీ, పీజీ కళాశాల ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి ప్రిన్సిపాల్ రామకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు ప్రదీప్, శ్రావణ్, నర్సయ్య, డాక్టర్ సతీశ్ కుమార్, మురళి, నాగరాజు, విద్యార్థులు పాల్గొన్నారు. హనుమాన్నగర్లోని బ్లూబెల్స్ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ జంగ సునీతామనోహర్రెడ్డి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, నవంబర్ 26: స్థానిక కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్ ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు గజ్జల ఆనందరావు, గోష్కి శంకర్, క్యాదాసి ప్రభాకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి సీపీఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు కొయ్యడ సృజన్కుమార్, టేకుమల్ల సమ్మయ్య, మణికంఠరెడ్డి, సదాశివ తదితరులు పాల్గొన్నారు. అలాగే, అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మామిడి విద్యాసాగర్ ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు వెంకటేశ్, సదానందం, మల్లయ్య, నవీన్ పాల్గొన్నారు. బీఎస్పీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు నిషాని రామచంద్రం పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ నాయకులు దొడ్డె సమ్మయ్య, రవీందర్, ప్రభాకర్, జన్ను స్వరూప, నిషాని సుమలత, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి దిశ సభ్యుడు జానపట్ల స్వామి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీ స్టడీ సర్కిల్లో అంబేద్కర్ చిత్రపటానికి డిప్యూటీ డైరెక్టర్ రాంరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవికుమార్, కోర్సు కో-ఆర్డినేటర్ శ్రీనివాస్, సిబ్బంది శోభ, కార్తీక్ పాల్గొన్నారు.
కోర్టు చౌరస్తా, నవంబర్ 26: జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ హాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన కార్యదర్శి జూపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలోని చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి బీమాసాహెబ్, ప్రతినిధులు రమేశ్, శ్రీకాంత్, తేజ్దీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపెల్లి మోహన్, న్యాయవాది కొరివి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.